ఎన్నో ఏళ్లుగా పార్లమెంట్ క్యాంటీన్లో చట్టసభ సభ్యులకు అందిస్తోన్న రాయితీలకు స్వస్తి పలుకుతూ కేంద్రం మరో నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టడానికి కొద్ది రోజుల ముందు లోక్సభ సెక్రటేరియట్ కొత్త ధరలతో కూడిన ఆహారపదార్థాల జాబితాను విడుదల చేసింది. కొత్త మెనూలో ధరల పెరుగుదల స్పష్టంగా కనిపించింది.క్యాంటీన్లో అత్యంత చౌకగా ఒక చపాతీ రూ.3కి లభిస్తుండగా.. నాన్ వెజ్ బఫెను రూ.700లకు పెంచుతూ ఈ మార్పులు చేసినట్లు సచివాలయం తాజాగా పేర్కొంది. ఇకపోతే వెజ్ బఫె ధర రూ.500గా ఉంది. హైదరాబాదీ మటన్ బిర్యానీని ఇన్ని రోజులు రూ.65కి మాత్రమే అమ్మేవాళ్లు ఇప్పుడు ఈ బిర్యానీ రేటు కూడా పెంచారు.