పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్..హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.120 పైకి కదిలింది. దీంతో రేటు రూ.45,820కు ఎగసింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.100 పెరుగుదలతో రూ.42,000కు చేరింది.బంగారం ధర పెరిగితే.. వెండి రేటు మాత్రం పడిపోయింది. వెండి ధర రూ.300 దిగొచ్చింది. దీంతో కేజీ వెండి ధర రూ.69,400కు క్షీణించింది.