తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో మాస్ మహారాజా రవితేజ ఒకరు . టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన యువ నటుల లో సందీప్ కిషన్ ఒకరు . మాస్ మహారాజా రవితేజ వాళ్ళనే గత రెండు సంవత్సరాలుగా కానీ పనిని టాలీవుడ్ యువ నటుడు సందీప్ కిషన్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది . అది ఏమిటి అనుకుంటున్నారా ..? అసలు విషయం లోకి వెళితే ... రవితేజ ఆఖరుగా సంక్రాంతి పండుగ సందర్భంగా క్రాక్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా రవితేజ "ఈగల్" అనే మూవీ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించాడు.

కానీ ఈ సంవత్సరం సంక్రాంతి సీజన్ కి అనేక సినిమాలు విడుదలకు రెడీగా ఉండడంతో ఈ సినిమా వెనక్కు తగ్గింది. దాని తర్వాత ఫిబ్రవరి నెలలో ఈ మూవీ విడుదల అయింది. ఇక ప్రస్తుతం రవితేజ RT 75 అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని కూడా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ మూవీ కూడా విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది.

ఇలా గత రెండు సంవత్సరాలుగా సంక్రాంతి కి రావాలని చూస్తున్న రవితేజ వల్ల కానీ పనిని సందీప్ కిషన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ యువ నటుడు త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరి గత రెండు సంవత్సరాలుగా రవితేజ వల్ల కాని పనిని సందీప్ కిషన్ చేసి చూపిస్తాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: