డైరెక్టర్ కొరటాల శివ గతంలో ఎన్నో చిత్రాలకు రచయితగా పనిచేశారు.. కానీ మిర్చి సినిమాతో డైరెక్టర్ గా మారి తన స్టామినా చూపించారు. ఈ సినిమా విజయం తర్వాత ప్రభాస్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వరుసగా మహేష్ బాబుతో రెండు బ్లాక్ బాస్టర్ నిమాలను తీశారు. ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ తీసి మరో విజయాన్ని అందుకున్నప్పటికీ.. అంత సంపాదించిన తర్వాత ఆచార్య సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఒక్కసారిగా ఈయన క్రేజ్ పడిపోయింది. అయినప్పటికీ కూడా దేవర సినిమాని ఎన్టీఆర్ తో పాన్ ఇండియా లేవల్లో కొరటాల శివ తెరకెక్కించారు.


దేవర సినిమా రేపటి రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా ఈ సినిమా సక్సెస్ అయితే దేవర-2 ఉంటుంది. అయితే ఈ సినిమా తీయడం కూడా కాస్త లేట్ అవుతుందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.ఎందుకంటే ఎన్టీఆర్ ఎన్నో చిత్రాలకు డేట్లను కేటాయించారు. ఈ సమయంలోనే కొరటాల శివ తన తదుపరి చిత్రాలను ఏ హీరోలతో తీయబోతున్నారనే విషయాన్ని ఇటీవలే ఇంటర్వ్యూలో మాట్లాడిన దాన్నిబట్టి తెలుస్తోంది. అల్లు అర్జున్తో కొరటాల శివ ఒక సినిమా అధికారికంగా రాబోతోందని తెలుస్తోంది.


దేవర సినిమా ప్రమోషన్స్ లో భవిష్యత్తులో అల్లు అర్జున్ తో కచ్చితంగా సినిమా ఉంటుందని వెల్లడించారు. ఒకవేళ మహేష్ బాబు తో కూడా మరొక సినిమా చేయవచ్చని.. అలాగే ప్రభాస్ తో కూడా ఆచార్య సినిమా తరువాత కలిసి డిస్కషన్ చేశాము.. ప్రభాస్ ప్రస్తుతం సినిమా షూటింగ్లలో బిజీగా ఉండడం చేత సినిమా ఉండొచ్చు ఉండకపోవచ్చు అనే విధంగా వెల్లడించారు.  జూనియర్ ఎన్టీఆర్ దేవర పూర్తి అవ్వగానే వెంటనే బాలీవుడ్ లో వార్-2 చేయబోతున్నారు. అలాగే ప్రశాంత్ నీళ్లతో ఒక సినిమా చేయబోతున్నారు. ఇవి రెండు పూర్తి అవ్వడానికి కనీసం రెండు మూడేళ్లు పడుతుంది అంతలోపు ఈ హీరోలతో సినిమా తీసే ప్లాన్ చేస్తున్నారట కొరటాల శివ. అయితే ఇప్పుడు దేవర సినిమా మీదే ఈ హీరోలతో సినిమాలు ముడిపడి ఉన్నాయనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: