రాజమౌళితో సినిమా అంటే ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలకు వణుకు పుట్టుకొస్తుంది. ఆయనతో చేసిన సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత చేసిన సినిమాల రిజల్ట్ మాత్రం చుక్కలు చూపిస్తుంది ఫ్యాన్స్ కి. అది పెద్ద హీరో అయినా సునీల్ లాంటి చిన్న హీరో అయినా ఎవరిని వదిలిపెట్టడం లేదు. ఇప్పుడు ఇదే ఎన్టీఆర్ కు చుక్కలు చూపిస్తుంది. రాజమౌళి సెంటిమెంట్.. రెండేళ్లపాటు నానా కష్టాలు పడిన సినిమాకు దారుణంగా ఉందనే  టాక్ రావడంతో ఫ్యాన్స్ ఇప్పుడు కన్నీరు పెట్టుకొనే పరిస్థితి వచ్చింది. అంచనాలకు సినిమా సంబంధం లేదు అంటున్నారు సగటు ప్రేక్షకుడు.

అయితే ఇప్పుడు ఇదే మహేష్ బాబు అభిమానులకి భయం పుట్టిస్తుంది. ప్రస్తుతం రాజమౌళి- మహేష్ తో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతుంది.  అయితే ఈ మూవీను రాజమౌళి పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా పాన్ వరల్డ్ స్థాయిలో తెర‌కెక్కించబోతున్నాడు. ఈ సినిమా రిజల్ట్ పై అభిమానులకు ఏమాత్రం భయం లేదు కానీ తర్వాత సినిమాల పైన అభిమానులకు భయం పట్టుకుంది. నిజానికి మహేష్ బాబుకి గత  సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం అందించలేకపోయాయి. ఎన్నో ఎక్స్పెక్టేషన్ లో వచ్చిన గుంటూరు కారం భారీ డిజాస్టర్ గాగా మిగిలింది.

ఇప్పుడు రాజమౌళి సినిమా హిట్ అయిన తర్వాతి సినిమాలపై ఆ సెంటిమెంట్ ప్రభావం గట్టగానే ఉండే అవకాశం ఉందని అభిమానుల్లో కంగారు మొదలైంది. ఇప్పటికే ఈ సెంటిమెంట్ డబ్బుకు రాంచరణ్ ఎన్టీఆర్ అభిమానులకు మైండ్ విడిపోయింది. ప్రభాస్ ఫ్యాన్స్ కు మతులిపోయాయి.. ఇప్పుడే కొంచెం వారు బయటకు వస్తున్నారు. కాబట్టి మహేష్ చాలా జాగ్రత్తగా ఉండాలని తొందరపడి ఎలాంటి రిస్క్ చేయకూడదని వారు కోరుకుంటున్నారు. ఇక మరి మహేష్, రాజమౌళి మూవీ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: