మన బుల్లితెరపై వస్తున్న సీరియల్స్ లో ఎంతోమంది నటీనటులు వస్తున్నారు. వారిలో కొంతమందికి మాత్రమే మంచి క్రేజ్ వస్తుంది. అలాంటి వారిలో ప్రేమి విశ్వనాథ్ కూడా ఒకరు.. ఈ పేరు మన తెలుగు ప్రజలకు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.. వంటలక్క నటనతో తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మందిని కట్టిపడేసిన ఈ నటి స్టార్ హీరోయిన్లకు పోటీగా ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు. కేరళ రాష్ట్రానికి చెందిన ప్రేమి విశ్వనాథ్‌  ఒకే ఒక్క కార్తీకదీపం సీరియల్ తో తెలుగులో సూపర్ క్రేజ్‌ తెచ్చుకుంది. ఒకపక్క సీరియల్స్ యాడ్స్ తో పాటు పలు సినిమాల్లో కూడా నటించింది.

సూపర్ క్రేజ్‌ తెచ్చుకున్న ప్రేమీ విశ్వనాథ్ ఆస్తుల విష‌యంపై తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది. వంటలక్క లా చదివిందట. ఆమె ప్రాక్టీస్ కూడా చేస్తుందట. ఇక దాంతో పాటు ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రేమీ విశ్వనాథ్ కు  కేరళలో రెండు స్టూడియోలు ఉన్నాయట.  ఆ స్టూడియోలలో సినిమాలకు సంబంధించి, సీరియల్స్ కి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట. ఈ తరుణంలోనే ప్రేమి విశ్వనాథ్ కి ఎంత ఆస్తి ఉండవచ్చనే చర్చ సోషల్ మీడియాల జరుగుతోంది.

ఆమె ఆస్తులు రూ.50 కోట్లు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. కార్తిక దీపం సీరియల్ లో నటిస్తూనే.. ఫ్లవర్స్ టీవీలో ఓ కార్యక్రమానికి హోస్ట్ గా కూడా చేసింది. ప్రేమీ విశ్వనాథ్ భర్త డాక్టర్ వినీత్ భట్ 2017లో వరల్డ్ బెస్ట్ ఆస్ట్రాలజర్ గా గుర్తింపు పొందారు. ప్రస్తుతం తమిళంలో ‘సాల్మన్ 3D’ అనే చిత్రంలో నటిస్తోంది ప్రేమి విశ్వనాథ్. అటు మలయాళంలో ‘అకమే’ అనే షార్ట్ ఫిలిం‌లో నటించి.. ప్రొడ్యూస్ చేసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ బ్యూటీ కార్తీకదీపం 2 సీరియల్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అలానే పులు లేడీ వాలెంటెడ్ సినిమాల్లో కూడా నటించడానికి రెడీ అయింది. ప్రజెంట్ వరుస షూటింగ్ లతో బిజీగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: