రెబల్ స్టార్ ప్రభాస్ కొన్ని సంవత్సరాల క్రితం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన మున్నా అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్గా నటించగా ... ప్రకాష్ రాజ్మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. కోటా శ్రీనివాసరావు ఈ మూవీ లో ఓ ముఖ్యమైన పాత్రలో నటించాడు. ఇకపోతే ఈ సినిమాలు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించాడు.

భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమా విడుదల తర్వాత జరిగిన ఒక సన్నివేశం గురించి దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు. దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ... మున్నా సినిమా విడుదల అయింది. నేను థియేటర్లో జనాల మధ్యలో ఆ సినిమా చూశాను. నాకు ఎక్కడో తేడా కొట్టింది. ఈ సినిమా పెద్ద విజయం సాధించడం కష్టం అనిపించింది. ఆ విషయం చెబుదాము అని ప్రభాస్ ఇంటికి వెళ్లాను. ఇక ఆయన అప్పటికే ఆ సినిమా బ్లాక్ బాస్టర్ అని తన ఫ్రెండ్స్ తో సంబరాలు చేసుకుంటున్నాడు.

నేను ప్రభాస్ దగ్గరకు వెళ్లాను. సినిమా పెద్ద విజయం సాధించదు అని చెప్పాను. ఏంటి సార్ బయట అంతా బ్లాక్ బాస్టర్ అంటున్నారు అన్నాడు. లేదు నీకు తప్పు రిపోర్టు వచ్చింది. మహా అయితే యవరేజ్ సినిమా అవుతుంది. అంతకుమించి జరగదు అన్నాను. ఇక తర్వాత అలాగే జరిగింది అని దిల్ రాజు ఆ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు. మున్నా మూవీ తర్వాత ప్రభాస్ , దిల్ రాజు కాంబోలో మిస్టర్ ఫర్ఫెక్ట్ మూవీ రూపొందింది. ఈ మూవీ మంచి విజయం అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: