పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రాజకీయంలో బిజీగా మారిపోయాక పెండిగ్ సినిమాలను పక్కన పెట్టేశారు. పైగా జనసేనాని పవన్ ప్రస్తుతం ఆంధ్రా డిప్యూటీ సి‌ఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న తరుణంలో సినిమాలు మరింత కష్టంగా మారాయి. దాంతో అభిమానులు ఆందోళనలో ఉన్నారు. అలాంటి వారికి తాజాగా పవన్ “హరిహర వీరమల్లు” సినిమా షూటింగులో పాల్గొంటూ మంచి కిక్కిచ్చే వార్తను తెలియజేశారు. దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు దాదాపు షూటింగ్ పూర్తి చేసుకొని, పవన్ కల్యాణ్ నటించవలసిన ఎపిసోడ్స్ షూట్ చేస్తున్నారు.

అదే విధంగా ఈ సినిమా కాకుండా దర్శకుడు సుజీత్ తో “ఓజి” అనే సినిమా పవన్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసినదే. ఈ సినిమాపై కూడా అభిమానులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక అసలు విషయంలోకి వెళితే, ఈ రెండు సినిమాలు నుంచి కూడా సాలిడ్ అప్డేట్స్ వస్తాయని ఫీల్ అయిన అభిమానులకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. పవన్ బర్త్ డే కానుకగా ఆల్రెడీ ఫిక్స్ అయిన వీరమల్లు టీజర్, అదే విధంగా ఓజి ఫస్ట్ సింగిల్, విజయవాడ వరదలు కారణంగా మిస్ అయ్యాయి.

ఇక వీటిని ఇపుడు దసరా కానుకగా అయినా విడుదల చేయబోతారా? అని అనుకున్న అభిమానుల ఆశలు అడియాశలు కాబోతున్నట్టు రూమర్స్ నడుస్తున్నాయి. అవును, ఈ రెండు సినిమాలు నుంచి దసరా కానుకగా ఎలాంటి మేజర్ అప్డేట్స్ వచ్చే ఛాన్స్ లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. సో పవన్ ఫ్యాన్స్ కి మరోసారి డిజప్పాయింట్మెంట్ తప్పేలా లేదని టాలీవుడ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. మరోపక్క పవన్ కల్యాణ్ తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదం వివాదం విషయంలో దీక్ష చేపట్టిన సంగతి అందరికీ తెలిసినదే. అందుకే సినిమాల విషయంలో పవన్ చాలా నెమ్మదిగా ఉన్నాడని, షూటింగ్ అంటేనే అస్సలు ఇంట్రెస్ట్ చూపడం లేదని నిఘా వర్గాల ద్వారా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: