ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఏదైనా సినిమా సెంచరీ కొట్టాలి అంటే చాలా గగనంగా మారుతోంది .ముఖ్యంగా డబుల్ సెంచరీ అంటే మరింత కష్టపడాల్సి ఉంటుంది.. అయితే కోలీవుడ్ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా పేరు పొందిన రజనీకాంత్ మాత్రం మరొకసారి తన స్టామినాని రుజువయ్యేలా చేసుకున్నారు.. ఇటీవలే ఆయన నటించిన వెట్టయాన్ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా నాలుగు రోజులు లోనే 240 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని తీసుకువచ్చింది. దీంతో రజినీకాంత్ మరొకసారి 200 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టారు.


అయితే వెట్టయాన్ సినిమా ఏడవ చిత్రంగా  200 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది.. గతంలో రజనీకాంత్ నటించిన పేటా , దర్బార్ , కాబాలి, ఎందిరన్, జైలర్, రోబో-2.o వంటి చిత్రాలు ఈ ఫిట్ ని అందించాయి. రజనీకాంత్ ఇమేజ్ని 200 కోట్ల మార్కెట్లోకి తీసుకురావడం అంటే అది చాలా రికార్డ్ అని కూడా చెప్పవచ్చు. సూపర్ స్టార్ రజినీకాంత్ కి వరల్డ్ వైస్ గా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది. విదేశాలలో కూడా తన సినిమాలు భారీగానే కలెక్షన్స్ రాబడుతూ ఉంటాయి.



అలా చేయనా మలేషియా ,జైపాల్, థాయిలాండ్, కొరియా తదితర ప్రాంతాలలో కూడా రజనీకాంత్ ఇమేజ్ భారీగానే ఉన్నది. ముఖ్యంగా ఆయన వాకింగ్ స్టైల్ కి ఇండియన్స్ సే కాదు విదేశీయులు కూడా ఫిదా అవుతూ ఉంటారు. అలా ఎన్నో రికార్డులు సైతం రజనీకాంత్ అవలీలగా సాధించాడు అప్పటినుంచి రజనీకాంత్ విదేశాలలో సినిమాలు క్రమం తప్పకుండా రిలీజ్ అవుతూ ఉన్నాయి. ప్రస్తుతం డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో కూలి అనే సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రం కూడా గ్యాంగ్ స్టార్ బ్యాక్ గ్రౌండ్ లోనే తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. మరి ఈ సినిమా ఖచ్చితంగా భారీ బ్లాక్ భాస్టర్ విజయాన్ని అందుకోవడమే కాకుండా భారీ కలెక్షన్స్ రాబడుతుందని చిత్ర బృందం నమ్ముతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: