బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఎవరూ ఊహించని ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. నెల రోజుల పాటు కాస్త చప్పగా.. సాగిన షోను రి లాంచ్ చేశారు. వైల్డ్ కార్డుఎంట్రీ ద్వారా 8 మందిని ఓల్డ్ తీసుకవచ్చారు. ఇలా షోపై క్యూరియాసిటీని పెంచేశారు. గత సీజన్లో ఎప్పుడు చూడని కంటెంట్ ఇస్తుండటంతో భారీ రెస్పాన్స్‌ వస్తుంది. హైయేస్ట్ టీఆర్పీ రేటింగ్ తో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 దూసుకపోతోంది. ఈ వారం నామినేషన్స్ పూర్తి అయ్యాయి. ఏడో వారంలో 9 మంది గౌతమ్, నిఖిల్, పృథ్వీ, యష్మి, తేజ, నబీల్, నాగ్ మణికంఠ, ప్రేరణ, హరితేజ లు నామినేషన్స్‌లో ఉన్నారు. తాజాగా నేటి ఎపిసోడ్ (అక్టోబర్ 16)కు సంబంధించిన

 ప్రొమోను విడుదల చేశారు. ఇందులో విష్ణుప్రియ తన తల్లిదండ్రులు వేర్వేరుగా ఉండటం గురించి చెప్పింది. ఈ మాటలు విన్న గంగవ్వ కన్నీళ్లు పెట్టుకుంది. విష్ణుప్రియ ప్రియ మాట్లాడుతూ.. ‘నాన్న ఊరిలో ఉంటారు. ఆయనతో మాట్లాడటం అమ్మకు ఇష్టం లేదు. అమ్మ కోసం నాన్న మీద ఎంత ప్రేమ ఉన్నా, ఎంత మిస్ అయినా కూడా నాన్నతో నేను మాట్లాడలేదు’ అని అంది. దీంతో గంగవ్వ ఎమోషనల్ అయింది. కళ్లలో నీళ్లు వచ్చాయి. ఆ తరువాత గంగవ్వతో మనిద్దరం డీల్ చేసుకుందాం అని మణికంఠ అడుగుతాడు. ఈ వారం గనక తాను సేవ్ అయితే బంగారు ముక్కు పుడక చేయిస్తానని చెప్పాడు. నాకు బంగారు వడ్డనం

 ఇస్తావా చెప్పు అని ఆ పక్కనే ఉన్న హరితేజ అంది. ఇక ఏడో వారంలో ఏకంగా తొమ్మిది మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. హరితేజ, ప్రేరణ, నిఖిల్, పృథ్వీరాజ్, గౌతమ్ కృష్ణ, యష్మి, నబీల్, టేస్టీ తేజ, నాగ మణికంఠ లు నామినేషన్స్ లోకి వచ్చారు. ఇక వీరికి ఆన్ లైన్ ఓటింగ్ పోల్స్ కూడా ప్రారంభమయ్యాయి. గత రెండు వారాల్లాగే ఈ వారం కూడా నబీల్ ఓటింగ్ లో దూసుకపోతున్నాడు. ఇప్పటివరకు అతనికి సుమారు 19 శాతం ఓట్లు పడ్డాయి. ఇక రెండో ప్లేస్ లో కొనసాగుతోన్న నిఖిల్ కు 17 శాతం ఓట్లు పోలయ్యాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: