- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. అఖండ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయ్యాక దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ ఆఖండ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 సినిమాను తెరకెక్కిస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే అఖండ 2 - తాండ‌వం సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఎట్టకేలకు అఖండ 2 తాండవం సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది. ఈ సినిమా ప్రారంభోత్సవం కూడా జరుపుకుంది. బాల‌య్య ఇద్ద‌రు కుమార్తెలు అయిన నంద‌మూరి తేజ‌స్విని.. నారా బ్రాహ్మ‌ణి స‌మ‌క్షంలో ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మా ల‌తో ప్రారంభోత్స‌వం జ‌రుపుకుంది.


ఇదిలా ఉంటే ఈ సినిమాలో నటించే నటీనటుల ఎంపిక పై దర్శకుడు బోయపాటి శ్రీను కాన్ సంట్రేష‌న్ చేసిన‌ట్టు తెలుస్తోంది. షూటింగ్ కి ఇంకా సమయం ఉన్నా.. ఇత‌ర కీలక పాత్రల్లో ఇతర భాషల నటులను కూడా తీసుకోవాలని మేకర్స్ ఫిక్స్ అయ్యార‌ట‌. ఈ నేపథ్యంలోనే నటీనటుల ఎంపిక పై బోయ‌పాటి కసరత్తులు చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర కోసం బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు .. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ను తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. సంజ‌య్ ద‌త్ ఈ సినిమాలో విల‌న్ లేదా మ‌రో కీల‌క పాత్ర‌లో క‌నిపించాడు అంటే ఖ‌చ్చితంగా ఈ సినిమాకు బాలీవుడ్ /  నార్త్ లో అదిరిపోయే రెస్పాన్స్ ఉంటుంద‌ని చెప్పాలి.


అఖండ 2 తాండ‌వం సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట , గోపీ ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఎస్ ఎస్ . థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. బోయపాటి శ్రీను – బాలయ్య కాంబినేషన్‌లో ఇప్ప‌టికే హ్యాట్రిక్ విజయాలు నమోదయ్యాయి. దీంతో అఖండ 2 – తాండవం సినిమా పై రెట్టింపు అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: