తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో కృష్ణ వంశీ ఒకరు. ఈయన ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించాడు. కానీ ఎప్పుడు రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాల జోలికి వెళ్లకుండా వైవిధ్యమైన సినిమాలను తెరకెక్కించి ఎన్నో విజయాలను అందుకోవడంతో ఈయనకు క్రియేటివ్ దర్శకుడిగా పేరు కూడా వచ్చింది. ఇకపోతే కొంత కాలం క్రితం ఈ దర్శకుడు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సోనాలి బింద్రే హీరోయిన్గా మురారి అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఈ మూవీ ద్వారా మహేష్ , సోనాలి బింద్రే , కృష్ణ వంశీ ముగ్గురికి కూడా అద్భుతమైన గుర్తింపు లభించింది. ఇకపోతే ఈ సినిమా తర్వాత కొంత కాలానికి కృష్ణ వంశీ , జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఇలియానా , చార్మి హీరోయిన్లుగా రాఖీ అనే మూవీ ని రూపొందించాడు.

భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు మొదట మంచి టాక్ వచ్చిన ఓవరాల్ గా మాత్రం ఈ సినిమా భారీ స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఇకపోతే కొంత కాలం క్రితం కృష్ణ వంశీ ఓ ఇంటర్వ్యూలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ గురించి కొన్ని ఆసక్తికరమైన వివరాలను తెలియజేశాడు. కృష్ణ వంశీ తాజా ఇంటర్వ్యూ లో భాగంగా మాట్లాడుతూ ... జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నేను రాఖీ మూవీ ని రూపొందించాను. ఆ మూవీ ద్వారా ఎన్టీఆర్ కి మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే ఎన్టీఆర్ తనతో మురారి లాంటి సినిమా చేయాలి అని అన్నాడు. కాకపోతే నేను మాత్రం అది నీపై సెట్ కాదు. రాఖీ లాంటి సినిమానే నీపై అద్భుతంగా వర్కౌట్ అవుతుంది అని చెప్పాను అని తాజా ఇంటర్వ్యూలో భాగంగా కృష్ణ వంశీ తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: