సినిమా ఇండస్ట్రీ లో ఆల్మోస్ట్ మూవీ సెట్ అయ్యి లాంచింగ్ కార్యక్రమాలు కూడా పూర్తి అయిన తర్వాత కూడా కొన్ని కారణాల వల్ల సినిమాలు ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇక చిన్న హీరోలు , చిన్న దర్శకుల విషయంలో ఇలా జరిగితే పెద్ద విషయం ఏమీ కాదు. కానీ స్టార్ హీరో సినిమాకి ఇలా జరిగితే అది పెద్ద న్యూస్ గా మారుతుంది. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరియర్ లో కూడా ఓ సినిమా విషయంలో ఇలా జరిగింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా మగధీర అనే సినిమా రూపొంది అదిరిపోయే రేంజ్ అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ తో చరణ్ , కాజల్ అగర్వాల్ జంటకు అద్భుతమైన గుర్తింపు లభించింది. ఇకపోతే మగధీర లాంటి బ్లాక్ బస్టర్ సినిమా వచ్చిన తర్వాత రామ్ చరణ్ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా తమిళ దర్శకుడు ధరణి మెరుపు అనే ఓ టైటిల్ తో సినిమాను మొదలు పెట్టాడు. ఈ మూవీ కి సంబంధించిన లాంచింగ్ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. ఇక ఈ సినిమా స్టార్ట్ అవుతుంది అనే క్రమంలో ఎందుకో ఏమో తెలియదు కానీ ఈ సినిమా సడన్ గా ఆగిపోయింది.

ఆ తర్వాత కొంత కాలానికి ఈ సినిమా వార్తలే లేకుండా పోయాయి. ఇక ఆ తర్వాత రామ్ చరణ్ తన పనులు తాను చేసుకుంటే , కాజల్ కూడా తన పనులు తాను చేసుకుంది. ఇకపోతే ఈ సినిమా క్యాన్సిల్ అయిన తర్వాత రామ్ చరణ్ హీరో గా రూపొందిన నాయక్ , గోవిందుడు అందరివాడేలే సినిమాల్లో కాజల్ అగర్వాల్ , చరణ్ కి జోడిగా నటించింది. ఇక రామ్ చరణ్ హీరోగా రూపొందిన ఎవడు సినిమాలో కాజల్ అగర్వాల్ ఓ చిన్న పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: