చైల్డ్ ఆర్టిస్టులుగా చలామణీ అయ్యేవారు సడెన్ గా మాయమయ్యి, కొన్నాళ్ల తరువాత హీరో హీరోయిన్లుగా ఎంట్రీలు ఇవ్వడం మనకు తెలిసిందే. హీరో తరుణ్, ఎన్టీఆర్, అందాల తార శ్రీదేవి ఈ కోవడకు చెందినవారే. ఇలా అనేకమంది మొదట చైల్డ్ ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇచ్చి, తెలుగు ఇండస్ట్రీలో ఎదిగినవారిని ఎంతమందినో చూడవచ్చు. ఇక ఇక్కడ కనబడిన ఫోటోలో ఉన్న అబ్బాయిని మీరు ఒకసారి చూడండి. తను ఇప్పుడు ఆర్టిస్ట్‌గా టాలీవుడ్లో దూసుకుపోతున్నాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మంచు విష్ణు చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని తీసుకుంటున్న ఈ కుర్రాడు ఎవరో ఇప్పటికైనా గుర్తు పట్టారా?

ప్రస్తుతం ఈ కుర్రాడు నటుడిగా పలు సీరియల్స్‌లో, చిత్రాల్లో, వెబ్ సిరీస్‌లలో అలరిస్తున్నాడు. ఇతగాడికి ఫ్యాన్ ఫ్యాలోయింగ్ కూడా బాగానే ఉందండోయ్. అతడు మరెవరో కాదు… బుల్లితెర హీరో 'మానస్ నాగులపల్లి'. ఈయన ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న 'బ్రహ్మముడి' సీరియల్లో హీరోగా నటిస్తున్నాడు. ఇక ఈ హీరోకి అమ్మాయిల ఫాలోయింగ్ కూడా తక్కువేం కాదు. మానస్ చైల్డ్ ఆర్టిస్టుగా మొదటిగా 2004లో మహేష్ బాబు, శ్రియ జంటగా నటించిన 'అర్జున్' లో బాలనటుడిగా వెండితెరకు పరిచయమైయ్యాడు. ఆ తర్వత నరసింహనాయుడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా మెరిశాడు.

కట్ చేస్తే, 2015లో హీరోగా 'ఝలక్' మూవీతో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో కాయ్ రాజా కాయ్, అతను, ప్రేమికుడా, గోలి సోడా, మొదలైన చిత్రాల్లో నటించి మెప్పించాడు. ఇక వెండితెరపై అలరించిన మానస్ ఆ తర్వాత బుల్లితెరని కూడా విడిచిపెట్టలేదు. భలే ఛాన్సులే, కోయిలమ్మా, కార్తీకదీపం వంటి ధారావాహికల్లో నటించి మెప్పించాడు. దీని తర్వాత తెలుగు బిగ్ బాస్ సీజన్ 5లో కూడా ఎంట్రీ ఇచ్చి ఫ్యాన్స్ బేస్ పెంచుకున్నాడు. ఇటీవలే మాన్షన్ అనే వెబ్ సిరీస్‌లో కూడా నటించాడు. ఈ హీరో గత ఏడాది అనగా, 2023 నవంబర్ 22న శ్రీజ అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా లీడ్ చేస్తూ.. మరోవైపు ప్రొఫిషినల్‌గా కూడా రాణిస్తున్నాడు మానస్. త్వరలో తెలుగులో రెండు బడా సినిమాలలో కీ రోల్స్ చేయబోతున్నాడట!

మరింత సమాచారం తెలుసుకోండి: