తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ రజనీ కాంత్ తాజాగా వెట్టయన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టీ జే జ్ఞానవెల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మంజు వారియర్ హీరోయిన్గా నటించింది. దగ్గుపాటి రానా , అమితా బచ్చన్ , ఫాహాద్ ఫజిల్మూవీ లో కీలక పాత్రలలో నటించారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ మూవీ ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ వారు నిర్మించారు. భారీ అంచనాలు నడుమ అక్టోబర్ 10 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా పెద్ద స్థాయి విజయాన్ని అందుకునే అవకాశాలు కనబడడం లేదు.

ఇకపోతే ప్రస్తుతం రజిని , లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న కూలీ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో అనేక మంది అద్భుతమైన క్రేజ్ ఉన్న నటి నటులు కనిపించబోతున్నారు.  టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ రజనీ కాంత్ ఈ సినిమాలో హీరోగా నటిస్తూ ఉండడం ... కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి లోకేష్ కనకరాజ్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండడంతో ప్రస్తుతానికి ఈ సినిమాపై కోలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ అంచనాలు జనాల్లో నెలకొని ఉన్నాయి.

ఇకపోతే లోకేష్ కనకరాజు , రజనీ కాంత్ కోసం మొదట కూలీ అనే కథను కాకుండా వేరే దాని తయారు చేయాలి అనుకున్నాడట. అందులో భాగంగా రజిని గురించి ఒక కథ ను రాయడం కూడా మొదలు పెట్టాడట. కానీ అది పూర్తి చేసే ప్రాసెస్ లో ఆయన చాలా స్ట్రగుల్ ఫీల్ అయ్యాడట. దానితో ఆ కథను పక్కన పెట్టేసి కూలి మూవీ స్టోరీ ని తయారు చేశాడు అని ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: