తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్టార్ కథానాయకులుగా రాణిస్తున్నారు.. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్. నిజ జీవితంలో ఎంతో స్నేహంతో ఉంటారు. ఒకరిపట్ల మరొకరు అభిమానాన్ని కురిపిస్తారు. సోషల్ మీడియాలో కూడా బావా.. బావా.. అంటూ సంభోధించుకుంటారు. ప్రస్తుతం ఒకరు పాన్ ఇండియా స్టార్ గా, మరొకరు గ్లోబల్ స్టార్ గా రూపాంతరం చెందారు. ఒకరికి సంబంధించిన విషయాలను మరొకరు షేర్ చేసుకోవడంతోపాటు కొన్ని విషయాల్లో ఒకేమాట మీద ఉంటారు.ఇదిలావుండగా టాలీవుడ్ లో తమ్ముడు  తమ్ముడే.. పేకాట పేకాటే అన్న సామెత నడుస్తుంది. ఎవరు ఎంత బంధుత్వాలు ఉన్నా.. ఎంత స్నేహం ఉన్నా.. సినిమాల విషయంలో మాత్రం పోటీ తప్పదు. బాగా క్లోజ్ అనుకున్నవారు కూడా సినిమాల విషయంలో వెనక్కి తగ్గేదేలే అంటుంటారు. ఈక్రమంలో అల్లు అర్జున్.. జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా ఇదే జరిగింది.అయితే సినిమాల విషయానికి వస్తే మాత్ర పోటా పోటీ నడుస్తూనే ఉంటుంది. ఇక ఎన్టీఆర్ రీసెంట్ గా దేవర సినిమాతో సంచలనం సృష్టించాడు.ఇటీవల విడుదలైన దేవర సినిమా కేరళ లో కేవలం రూ.1 కోటి లోపు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కేరళ రాష్ట్రం మొత్తంలో ఎన్టీఆర్ దేవర సినిమా లాంగ్‌ రన్‌ లో రూ.2 కోట్లకు అటు ఇటుగా వసూళ్లు నమోదు చేసిందని తెలుస్తోంది. అల్లు అర్జున్‌‌కు కేరళలో భారీ ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. బన్నీ క్రేజ్‌కు తగ్గట్టుగా అక్కడ మంచి బిజినెస్ అయితే జరిగే ఛాన్స్ ఉంది. కానీ వీళ్లు ప్రచారం చేసుకుంటున్నంత రేంజ్‌లో అయితే లేదని తెలుస్తోంది.ముఖ్యంగా కేరళలో పుష్ప 2 సినిమా రూ.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని చెప్పుకుంటున్నారు. అక్కడ స్టార్ హీరోల చిత్రాలే ఈ రేంజ్‌లో బిజినెస్ చేయవు. కానీ బన్నీ పీఆర్ మాఫియానో ఏమో గానీ.. పుష్ప 2 ప్రీ రిలీజ్ బిజినెస్ అంటూ ఇష్టమొచ్చిన లెక్కల్ని బయటకు వదులుతున్నారు.ఇదిలావుండగా దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ నటి శ్రద్దా కపూర్‌ ఐటం సాంగ్ చేయబోతుందనే గాసిప్ వచ్చిన సంగతి తెలిసిందే. పుష్ప 2 సినిమాలో మళయాల స్టార్‌ నటుడు ఫాహద్ ఫసిల్‌ కీలక పాత్రలో నటించడం వల్ల కేరళలో అంతటి భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి ఉండవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రీ రిలీజ్ బిజినెస్‌లో రికార్డుల మోత మ్రోగిస్తున్న పుష్ప 2, రిలీజ్ తర్వాత ఇదే జోరు కొనసాగించేనా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: