ప్రముఖ తమిళ నటుడు జయం రవి పేరు ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా చక్కెర్లు కొడుతోంది. దానికి కారణం లేకపోలేదు.. ఇటీవల జయం రవి, తన భార్య నుండి విడాకులు కోరుకున్నట్టు బహిరంగంగా, సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో హాట్ టాపిక్ అయిన సంగతి విదితమే. కాగా ఈ తరుణంలోనే జయం రవి, నటి ప్రియాంక మోహన్‌ ల నిశ్చితార్థం జరిగిందంటూ పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీనికి సంబంధించిన ఓ ఫొటో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతుండడంతో అంతా నిజమేనని అనుకున్నారు. అయితే ఈ వార్తలపై తాజాగా ప్రియాంక మోహన్‌ స్పష్టతనిచ్చారు. ఆయా కథనాలు చూసి తాను షాకయ్యానని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ‘‘జయం రవి, నేను కలిసి ‘బ్రదర్‌’ సినిమా కోసం వర్క్‌ చేయడం జరిగింది. ఆ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రబృందం రిలీజ్‌ చేసిన ఫొటో అది. అందులో మేమిద్దరం మెడలో పూలదండలు వేసుకుని ఉంటాం. అది చూసి చాలామంది మాకు ఎంగేజ్‌మెంట్‌ అయిందనుకున్నారు. ఇది నిజమే అనుకోని టాలీవుడ్‌లోని నా స్నేహితులు కాల్స్‌ చేశారు. కంగ్రాట్స్‌ కూడా చెప్పారు. దాంతో అసలు ఏం జరుగుతుందో నాకు అర్థంకాలేదు? పూర్తి విషయం తెలుసుకుని అది కేవలం సినిమాలోని స్టిల్‌ మాత్రమేనని క్లారిటీ ఇచ్చాను. ఆ తర్వాత మా మూవీ టీమ్‌ను తిట్టుకున్నా. వేరే ఫొటో ఏదైనా రిలీజ్‌ చేయొచ్చు కదా!’’ అని వారిని అడిగాను అని ప్రియాంక మోహన్‌ తెలిపారు.

కాగా ఈ సందర్భంగా మాట్లాడిన ఈ అమ్మడు, ఈ సంఘటన తనకు ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. ‘నానీస్‌ గ్యాంగ్‌లీడర్‌’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక మోహన్‌ గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళంతో పాటుగా మలయాళంలో కూడా నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవల విడుదలైన ‘సరిపోదా శనివారం’ ఎలాంటి విజయం అందుకుందో తెలిసిందే. ఇందులో భాగం కావడం ఆనందంగా ఉందని ప్రియాంక చెప్పారు. తమ కష్టానికి తగిన ఫలితాన్ని ప్రేక్షకులు కలెక్షన్స్‌ రూపంలో అందించారన్నారు. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘ఓజీ’ కోసం వర్క్‌ చేస్తున్న సంగతి విదితమే.

మరింత సమాచారం తెలుసుకోండి: