కొన్ని సంవత్సరాల క్రితం సూపర్ స్టార్ కృష్ణ అగ్ని పర్వతం అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో విజయ శాంతి , రాధ హీరోయిన్లుగా నటించగా ... అశ్విని దత్ ఈ సినిమాను నిర్మించాడు. ఇకపోతే అదిరిపోయే రేంజ్ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో శ్రీదేవి ని మొదట ఒక హీరోయిన్గా అనుకున్నారట. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల శ్రీదేవిసినిమా నుండి తప్పుకుందట. అసలు ఏం జరిగింది అనే వివరాలను తెలుసుకుందాం.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన కథ మొత్తం పూర్తి అయిన తర్వాత ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లలో ఒక హీరోయిన్గా శ్రీదేవి ని తీసుకోవాలి అని అనుకున్నారట. అందులో భాగంగా శ్రీదేవి ని కూడా సంప్రదించి కథ మొత్తాన్ని వివరించారట. ఇక మొదట కథ విన్నాక ఈ మూవీ స్టోరీ సూపర్ గా నచ్చడంతో ఈ సినిమాలో నటిస్తాను అని చెప్పిందట. ఇక ఆ తర్వాత ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండడం వల్ల తన పాత్ర ప్రాధాన్యత తగ్గిపోతుంది అని ఉద్దేశంతో ఈ సినిమా చేయను అని చెప్పిందట.

దానితో ఈ మూవీ బృందం కూడా ఏమీ చేయలేక శ్రీదేవి స్థానంలో మరో హీరోయిన్ ని తీసుకున్నారట. ఇకపోతే మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయం అందుకుంది. ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించిన విజయ శాంతి , రాధ కి ఈ మూవీ ద్వారా అద్భుతమైన గుర్తింపు లభించింది. ఈ సినిమా ద్వారా కృష్ణ , రాఘవేంద్రరావు కూడా మంచి గుర్తింపు లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: