వైసీపీ ఎమ్మెల్యే రోజా అనుచిత వ్యాఖ్యలు చేశారు. తనకు కావాల్సిన వారినే చిత్తూరు, గుంటూరు జిల్లాల కలెక్టర్లుగా నియమించుకొని, ఆ జిల్లాల్లో ఏకగ్రీవాలను హోల్డ్లో పెట్టాలనడం ఎస్ఈసీ స్థాయికి సరికాదని ఎమ్మెల్యే రోజా మండి పడ్డారు. చంద్రబాబు డైరెక్షన్లోనే నిమ్మగడ్డ ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆమె ధ్వజమెత్తారు. అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న నిమ్మగడ్డ.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, రాజ్యాంగం కల్పించిన అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.