కడపలో పుర సమరానికి సమయం ఆసన్నమైంది. నేడు ఏపిలో నామినేషన్లు ఉపసం హరణ ప్రక్రియ మొదలైంది. ఇప్పటికే పలువురు అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని పురపాలక సంఘాల్లో గతేడాది మార్చిలో నిలిచిపోయిన ప్రక్రియ నుంచి ఎన్నికలను తిరిగి కొనసాగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. నేడు, రేపు నామపత్రాల ఉపసంహరణ ప్రక్రియ జరగనుంది. ఎన్నికలు జరుగతున్న నగరం, పట్టణాల్లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మంతనాల ద్వారా అభ్యర్థులను పోటీలో నుంచి తప్పించి అధిక వార్డులను ఏకగ్రీవం చేసుకోవాలనేది అధికార పార్టీ వ్యూహం.