చిత్తూరు నగర పాలిక, మదనపల్లె, పలమనేరు, నగరి, పుత్తూరు పురపాలక సంఘాల పరిధిలో రాజకీయ పార్టీలు ప్రచారం హోరెత్తిస్తున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు నువ్వా..నేనా.. అన్నట్లుగా తెగ తిరిగి ఓటర్లను కలుస్తున్నారు. వివిధ పార్టీల నేతలు, అనుచరులు తమ అభ్యర్థుల గెలుపునకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. నగర, పట్టణాల వీధుల్లో హోరాహోరీ ప్రచారాలే సాగుతున్నాయి. ప్రలోభాలు, బెదిరింపు పర్వాలు కొనసాగుతున్నాయి. పుంగనూరులో అన్ని స్థానాలు ఏకగ్రీవం కావడం, శ్రీకాళహస్తిలో న్యాయస్థానం తీర్పుతో ఎన్నిక ఆగడం, కుప్పం కొత్తగా ఏర్పడిన పురపాలక సంఘం కావడంతో ఇక్కడ ఎన్నికలు లేవని తెలుస్తుంది.