తెలుగు ప్రేక్షకులకు సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎంతోమంది హీరోయిన్స్ కు డబ్బింగ్ చెప్పి మరింత పాపులారిటీ అందుకుంది. ఎన్నో మారూపురాని పాటలు కూడా పాడి తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది సింగర్ సునీత. ముఖ్యంగా ఈమె చక్కటి రూపంతో సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు సందడి చేస్తూనే ఉంటుంది. సునీత రెండో వివాహం చేసుకున్నప్పటినుంచి మరింత పాపులారిటీ సంపాదించుకుంది. అలాగే తన కొడుకుని కూడా హీరోగా లాంచ్ చేసింది.


తెలుగు సినీ ఇండస్ట్రీ తో ఎస్పీ బాలసుబ్రమణ్యం వంటి వారి చేత కూడా ప్రశంసలు పొందుకుంది గాయని సునీత. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక విషయాన్ని తెలియజేసింది.. అదేమిటంటే శ్రీరామరాజ్యం సినిమా డబ్బింగ్ జరుగుతున్న సమయంలో లెజెండ్రీ డైరెక్టర్ బాపు గారితో జరిగిన ఒక సంఘటనను సైతం తెలియజేసింది. ముఖ్యంగా తెలుగు సినీ ప్రేక్షకులకు నటులకు నిర్మాతలకు సైతం డైరెక్టర్ బాపు అంటే చాలా గౌరవిస్తూ ఉంటారు.ఆయన వచ్చారంటే కచ్చితంగా ప్రతి ఒక్కరు లేచి నిలబడి గౌరవం ఇస్తూ ఉంటారట. అలా ఒక సినిమా కోసం డబ్బింగ్ చప్పడానికి వెళ్లిన సింగర్ సునీత డబ్బింగ్ స్టూడియోలో బాపు గారు ఏదో రాసుకుంటూ ఉండగా సింగర్ సునీత రాగానే ఆమెను చూసి లేచి నిలబడి నమస్కరించారట.


ఈ విషయం సునీతకి ఆశ్చర్యాన్ని కలిగించిందని అంత గొప్ప డైరెక్టర్ తనకు ఇచ్చిన గౌరవం చూసి ఆయన సంస్కారానికి సునీత ఒక్కసారిగా షాక్ అయ్యిందట. అక్కడ ఉన్న నటీనటులే కాకుండా పక్కనే ఉన్న బాలకృష్ణ కూడా ఆశ్చర్యపోయారట.. ఆ సమయంలో బాలయ్య ఇలా చెబుతూ బాపుగారు మీ విద్యకి కళకి ఇచ్చిన గౌరవం అది అని తెలిపారట. అంతేకాదు సునీతకి బాపు ఆటోగ్రాఫ్ కూడా చాలా వెరైటీగా ఇచ్చారట. అది కూడా మీ వీర అభిమానిని అంటూ రాసి ఇచ్చారని తెలిపింది. ఈ విషయం అక్కడే ఉన్న బాలసుబ్రహ్మణ్యం గారు కూడా చూసి కుళ్లు కున్నట్లు సునిత వెల్లడించింది. బాపు గారి లాంటి డైరెక్టర్ ముందు తన లాంటి వ్యక్తి ఎంత అంటూ కానీ ఆయన సంస్కారానికి తను మాత్రం ఎప్పుడూ మర్చిపోలేనని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: