తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతు ఎంతో మంది ప్రేక్షకఆదరణ పొందిన షోలలో జబర్దస్త్ షో కూడా ఒకటి. ఈ కార్యక్రమం వల్ల చాలా మంది సెలబ్రిటీలు ఇండస్ట్రీకి పరిచయం కావడం కూడా జరిగింది. గతంలో ప్రతి గురు, శుక్రవారాలలో ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తూ ఉండేది. మొదట్లో జడ్జిలుగా నాగబాబు, రోజా కూడా ఉండేవారు. అయితే కొన్ని కారణాలవల్ల నాగబాబు ఈ కార్యక్రమం నుంచి తప్పుకోగా.. రోజా కూడా పొలిటికల్ వల్ల బుల్లితెరకు దూరమైంది. నాగబాబు స్థానంలోకి కృష్ణ భగవన్ ,సింగర్ మనో వంటి వారు వచ్చారు. ఆ తరువాత వీరు బుల్లితెరకు దూరమయ్యారు.



అయితే ఇప్పటికే కూడా టిఆర్పి రేటింగ్ కూడా తక్కువగా రావడంతో మళ్లీ అలనాటి హీరోయిన్స్ ని తీసుకురావడం జరిగింది మల్లెమాల సంస్థ. అయినా కూడా రేటింగ్ విషయంలో ఎలాంటి మార్పు రాకపోవడంతో కేవలం జబర్దస్త్ షోని మాత్రమే ఇప్పుడు ఉంచినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే నటుడు శివాజీని కూడా కొత్తగా జడ్జిగా తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇంద్రజ, కుష్బూ తదితర సెలబ్రిటీలు కూడా వచ్చారు. అయితే ఇప్పుడు తాజాగా మరొక కొత్త జడ్జిని తీసుకువచ్చినట్లు ప్రోమోలో చూపించడం జరిగింది.


ఇందులో అలనాటి హీరోయిన్ లయ ఈ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది. శివాజీ, లయ జంట వెండితెర పైన మంచి సూపర్ హిట్ జోడిగా పేరు సంపాదించింది. ఇలా వెండితెర పైన సందడి చేసిన ఈ జంట ఇప్పుడు మళ్లీ జబర్దస్త్ షోలో జడ్జిలుగా వ్యవహరించడంతో ఏ మేరకు ఈ షో కి టిఆర్పి రేటింగ్ రావడంలో సహాయపడతారో చూడాలి మరి. ముఖ్యంగా జబర్దస్త్ కార్యక్రమం వల్ల ఫేమ్ వచ్చిన తర్వాత చాలామంది జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి మరి సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. మరి లయ ఆయన జడ్జిగా ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: