బుధవారం జులై 17, 2024 నాడు దేవాశయని ఏకాదశి వచ్చింది. దీన్నే తొలి ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈరోజు నుంచి చాతుర్మాసం కూడా ప్రారంభం కానుంది. ఇప్పటినుంచి నాలుగు నెలలపాటు శుభకార్యాలు జరగవు. తొలి ఏకాదశి రోజున శిమహావిష్ణువు, లక్ష్మీదేవిని పూజిస్తారు. విష్ణుమూర్తి తొలి ఏకాదశి నుంచి యోగ నిద్రలోకి వెళతాడు. నాలుగు నెలల పాటు నిద్రవస్థలో ఉన్న తర్వాత కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజు విష్ణు మూర్తి మేల్కొంటాడని భక్తుల విశ్వాసం. ఈ నాలుగు నెలలను చాతుర్మాసం అని పిలుస్తారు. ఇందులో వివాహం, గృహప్రవేశం మొదలైన శుభకార్యాలు నిర్మి హించారు.


విష్ణువు నిద్రలోకి వెళ్లిన తరువాత విశ్వాన్ని నడిపించే బాధ్యతను శివుడు స్వీకరిస్తాడు. అందుకే చాతుర్మాసాలలో శివుడిని పూజించటం విశేషం. ఈ ఏకాదశి నాడు చేసే కొన్ని పరిహారాలు మంచి ఫలితాలను ఇస్తాయి. లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. మీరు శ్రీమహావిష్ణువును పూజిస్తే లక్ష్మీదేవి స్వయంగా మీ వద్దకు వస్తుంది. కావున ఈరోజు సాయంత్రం పూట చెట్టు కింద దీపం వెలిగించాలి. ఈ రోజున శ్రీమహావిష్ణువు వ్యక్తిగతగా రావి చెట్టుపై కూర్చుంటాడని చెబుతారు. అంతేకాకుండా ఈరోజు రెండు రూపాయలు తీసుకుని దేవుడి పూజలో ఉంచుకోవాలి. ముందుగా భగవంతుని పంచామృతంతో అభిషేకం చేయించాలి.


ఆపై లక్ష్మీదేవి ముందు ఒక రెండు రూపాయలను ఉంచి పూజ చేయాలి. ఇది లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటుందని చెబుతున్నారు. ఈరోజు తులసిపై నెయ్య దీపం కూడా వెలిగించాలి. ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఐశ్వర్యం, ఆనందానికి లోటు ఉండదు. ఏకాదశి ఉపవాసం రోజున రాత్రి జాగారణకు కూడా ప్రాముఖ్యత ఉంది. కావున ఈ ఏకాదశి రోజు రాత్రి విష్ణుమూర్తిని జపించాలి. కాబట్టి ఈ ఏకాదశి రోజున మీరు కూడా తప్పకుండా పూజ చేయండి. పూజ చేసి దేవుడు ఆశీస్సులను అందుకోండి. శ్రీమహావిష్ణువును కొలవండి.

మరింత సమాచారం తెలుసుకోండి: