ప్రస్తుతం పెట్రోల్ ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే.. ఒకవైపు వంట గ్యాస్ బాదుడు, మరో వైపు పెట్రోల్ ధరలు సామాన్యుడికి గుండె పోటును తెప్పించాయి. ఈ మేరకు కొత్త వాహనాలను కొనాలనుకునే ఆలోచనను విరమించుకొంటున్నారు. అలాంటి వారికి శుభవార్త.. టాటా మోటార్స్ సరికొత్త ఫీచర్లతో కూడిన కారును మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. ఎలక్ట్రాన్ వాహనాల హబ్ గా మారుతున్న నేపథ్యంలో టాటా కూడా అలాంటి ఎలెక్ట్రానిక్ వాహనాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది.


టాటా మోటార్స్ ఈ ఏడాది తన ఎలక్ట్రిక్ కారు టాటా ఆల్ట్రోజ్ ఈవీ విడుదల చేయనుంది. ఇది ఎలక్ట్రిక్ కారు కాబట్టి, దాని మార్కెట్ చాలా కాలంగా ఎదురుచూస్తోంది. ప్రీమియం హ్యాచ్‌ బ్యాక్ కేటగిరీకి చెందిన ఈ కారును 2019 సంవత్సరం లో స్విట్జర్లాండ్‌లో జరిగిన జెనీవా మోటార్ షోలో కంపెనీ మొదటిసారి ప్రదర్శించింది. మీడియా నివేదికల ప్రకారం, ఈ కారును ఈ ఏడాది ద్వితీయార్ధం ప్రారంభంలో లాంచ్ చేయవచ్చని భావిస్తున్నారు.


కొత్త ఎలక్ట్రిక్ కారులో భద్రత మరియు లక్షణాలను కూడా చూడవచ్చు. గాడివాడి వార్తల ప్రకారం, భద్రత పరంగా, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, ఎబిడి విత్ ఇబిడి, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్, ఫ్రంట్ సీట్ బెల్ట్ రిమైండర్, రివర్స్ పార్కింగ్ కెమెరా, హై స్పీడ్ అలర్ట్ సిస్టమ్, రియర్ పార్కింగ్ సెన్సార్లు ఉంటాయి.ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలతో కూడి ఉంటుంది. ఇవి కాకుండా, వింగ్ మిర్రర్స్, ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌తో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, యాంబియంట్ లైటింగ్, క్రూయిజ్ కంట్రోల్, రియర్ ఎసి వెంట్స్, డ్రైవ్ మోడ్‌లు, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ మీకు కనిపిస్తాయి... ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది మైలేజ్.. పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత 300 కిలోమీటర్ల దూరం వరకు ఉంటుంది. ఈ కారు ధర కూడా కేవలం 10 లక్షలు మాత్రమే..

మరింత సమాచారం తెలుసుకోండి: