చాలా మంది అమ్మాయిలు కూడా తమ ముఖ చర్మాన్ని అందంగా, కాంతివంతంగా మెరిపించుకునేందుకు నెలలో రెండు మూడు సార్లు ఖచ్చితంగా ఫేషియల్ చేయించుకుంటూ ఉంటారు.అందుకోసం వేలకు వేలు డబ్బులు ఖర్చు పెడుతుంటారు.కానీ ఇప్పుడు చెప్పబోయే టిప్ ని మీరు పాటిస్తే పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే ఇరవై నిమిషాల్లో గ్లోయింగ్, షైనీ స్కిన్ ను ఈజీగా ఇన్స్టంట్ గా తమ సొంతం చేసుకోవచ్చు. ఈ రెమెడీ ముందు అసలు ఏ ఫేషియల్ కూడా సరిపోదు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ముందుగా మీరు ఒక బంగాళదుంపని తీసుకుని దానిని వాటర్ తో బాగా శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, రెండు లెమన్ స్లైసెస్ ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇక ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో ఆ జ్యూస్ ను మీరు సపరేట్ చేసుకోవాలి.


తరువాత ఈ జ్యూస్ లో మీరు రెండు టేబుల్ స్పూన్లు ముల్తానీ మట్టి, వన్ టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్ ఇంకా ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ పెరుగు వేసుకొని అన్నీ బాగా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి, మెడకు, ఇంకా మీ చేతులకు కూడా అప్లై చేసుకుని ఒక ఇరవై నిమిషాల పాటు అలాగే ఆరబెట్టుకోవాలి. ఆ తరువాత వేళ్ళతో చర్మాన్ని సాఫ్ట్ గా రబ్ చేసుకుంటూ వాటర్ తో బాగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు ఈ రెమెడీని మీరు పాటిస్తే ఇక మీకు ఫేషియల్ అక్కర్లేదు. మీ స్కిన్ సహజంగానే చాలా అందంగా గ్లోయింగ్ గా మెరుస్తుంది.ఇంకా మీ స్కిన్ టోన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది.అలాగే మీ చర్మంపై మలినాలు, మృత కణాలు పేరుకుపోకుండా ఉంటాయి. మీ చర్మం చాలా మృదువుగా మారుతుంది. ముడతలు, చారలు వంటి వృద్ధాప్య ఛాయలు కూడా చాలా త్వరగా దరిచేరకుండా ఉంటాయి. అలాగే పిగ్మెంటేషన్ సమస్య నుంచి కూడా ఈజీగా  బయటపడొచ్చు. కాబట్టి సహజంగానే అందంగా మెరిసిపోవాలని భావించేవారు తప్పకుండా ఈ టిప్ ని పాటించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: