ప్రస్తుత కాలంలో అసలు చిన్నా పెద్దా అనే తేడానే లేకుండా అందరూ అధిక బరువు సమస్య బారిన పడుతున్నారు. జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం, నూనెలో వేయించిన పదార్థాలను తీసుకోవడం ఇంకా కూర్చుని పని చేయడం వంటి వివిధ కారణాల వలన మనలో చాలా మంది కూడా ఈ సమస్య బారిన పడుతున్నారు. అందుకే ఈ అధిక బరువు సమస్యను మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.ఈ సమస్య తగ్గాలంటే రోజూ చేసే పనులతో పాటు ఇప్పుడు చెప్పే పానీయాన్ని కూడా తయారు చేసుకుని తాగడం వల్ల చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. బరువు తగ్గించే ఈ పానీయాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ఇక ఈ పానీయాన్ని తయారు చేసుకోవడానికి గానూ మనం జీలకర్రను, అల్లాన్ని, నిమ్మరసాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా మీరు జార్ లో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి.ఆ తరువాత ఈ పొడిని ఒక గిన్నెలో వేసుకుని అందులో ఒక ఇంచు అల్లం తురుము, లీటర్ నీటిని పోసి వేడి చేయాలి.ఇక ఆ నీళ్లు మరిగిన తరువాత మరో 5 నిమిషాల పాటు మరిగించి స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి. ఆ తరువాత ఈ పానీయాన్ని వడకట్టి అందులో ఒక నిమ్మకాయ నుండి తీసిన మొత్తం నిమ్మరసాన్ని వేసి బాగా కలపాలి. ఇలా చేయడం వల్ల బరువు తగ్గించే పానీయం ఈజీగా తయారవుతుంది. ఇక ఈ పానీయాన్ని ఆహారం తీసుకోవడానికి అర గంట ముందు 50 ఎమ్ ఎల్ మోతాదులో తీసుకోవాలి. ఇలా మూడు పూటలా తీసుకోవడం వల్ల మనం చాలా ఈజీగా బరువు తగ్గవచ్చు. దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో ఎక్కువగా ఉండే కొలెస్ట్రాల్ ఈజీగా తొలగిపోతుంది. శరీరంలో ఎక్కువగా ఉండే నీరు కూడా బయటకు పోతుంది. అలాగే శరీరంలో మెటబాలిజం రేటు పెరుగుతుంది. ఇంకా అంతేకాకుండా చక్కటి ఆరోగ్యం కూడా మన సొంతమవుతుంది. అందుకే బరువు తగ్గాలనుకునే వారు ఇలా జీలకర్రతో చక్కటి పానీయాన్ని తయారు చేసుకుని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: