శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం తొగరాం సర్పంచ్గా వాణిశ్రీ విజయం సాధించారు. తన ప్రత్యర్థి తమ్మినేని భారతిపై వాణిశ్రీ 510 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఏపీ పంచాయతీ ఎన్నికల్లో తన తోడికోడలుపైన పంతం నెగ్గించుకున్నారు. దీంతో ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం భార్య వాణీ సీతారం ప్రతికారం తీర్చుకున్నట్లైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి పెంచిన పంచాయతీ పోరులో స్పీకర్ కుటుంబం సత్తా చాటింది. ఫలితం వెలువడిన అనంతరం వైకాపా కార్యకర్తలు వాణిశ్రీకి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు.
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం తొగరాం సర్పంచ్గా వాణిశ్రీ విజయం సాధించారు. తన ప్రత్యర్థి తమ్మినేని భారతిపై వాణిశ్రీ 510 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఏపీ పంచాయతీ ఎన్నికల్లో తన తోడికోడలుపైన పంతం నెగ్గించుకున్నారు. దీంతో ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం భార్య వాణీ సీతారం ప్రతికారం తీర్చుకున్నట్లైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి పెంచిన పంచాయతీ పోరులో స్పీకర్ కుటుంబం సత్తా చాటింది. ఫలితం వెలువడిన అనంతరం వైకాపా కార్యకర్తలు వాణిశ్రీకి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు.