శ్రీలంకలో ప్రజాందోళనలు మిన్నుమిడుతున్నాయి. ఈ ఆగ్రహజ్వాలకు భయపడి అధ్యక్షుడు గొటబాయ ఇంటి నుంచి పరారైన సంగతి తెలిసిందే. అయితే.. ఆ ఇంటిలోకి దూసుకెళ్లిన ఆందోళన కారు.. ఇంట్లో తిష్టవేశారు. ఆందోళనకారులు ఇల్లంతా ఆక్రమించుకుని అక్కడే ఉండటంతో అనేక కొత్త విషయాలు ఆ ఇంటి గురించి తెలుస్తున్నాయి.


అవేంటంటే.. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స నివాసంలో గుట్టలుగా నోట్ల కట్టలు దొరికాయట. అలాగే ఆ ఇంట్లో ఓ భారీ బంకర్‌ను కూడా ఆందోళన కారులు కనిపెట్టారు. ఈ బంకర్‌ను చూసిన తర్వాత  అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అక్కడి నుంచే పారిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఆ
బంకర్‌ బయటి నుంచి చూస్తే సాధారణ గదిలాగానే ఉందట. తలుపులు పగులగొట్టి చూస్తే అప్పుడు బంకర్ కనిపించిందట. అయితే శుక్రవారమే పరారైన అధ్యక్షుడు గొటబాయ రాజపక్స గురించి మాత్రం ఇంకా సమాచారం తెలియడం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: