
బీజేడీ, వైసీపీ, బీఎస్పీ, టీడీపీ, ఏఐడీఎంకే, జేడీఎస్, శిరోమణి అకాలిదళ్, శివసేన, జేఎంఎం వంటి ప్రాంతీయ పార్టీలు కూడా తమ ఓటు ముర్ముకేనని ఇప్పటికే చెప్పేశాయి. అంటే మూడోవంతు ఓట్లు ముర్ముకే దక్కుతాయన్నమాట. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలకు చెందిన మొత్తం 10లక్షల 86వేల 431 ఓట్లు పోల్ అవుతాయి. అందులో 6.67లక్షల ఓట్లు ముర్ముకే వచ్చే అవకాశం ఉంది. ఈ రాష్ట్రపతి ఎన్నిక ఫలితాలు 21న వెలువడతాయి. కొత్త రాష్ట్రపతి నెల 25న ప్రమాణ స్వీకారం చేస్తారు.