బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఇటీవల సోషల్ మీడియాలో కాంగ్రెస్ సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే వాటిలో తాజాగా కర్నాటక సీఎం సిద్ధరామయ్యను ఉద్దేశించి కేటీఆర్ పెట్టిన పోస్ట్ పై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ బూటకపు వాగ్దానాలతో తెలంగాణ ప్రజలను సిగ్గులేకుండా మోసం చేసినందుకే మేము ఎన్నికల్లో ఓడిపోయామన్న కేటీఆర్‌.. డిసెంబర్ 9, 2023 గడిచిపోయింది, కానీ హామీల అమలు ఎక్కడ అని ప్రశ్నించారు.


రైతులకు, కౌలు రైతులకు, రైతు కూలీలకు రైతు భరోసా హామీ, రూ. 2 లక్షల వ్యవసాయ రుణమాఫీ, రూ.4000 సంక్షేమ పెన్షన్, రూ.500 గ్యాస్ సిలిండర్,  మీ పార్టీ ప్రతి మహిళకు రూ.2500 హామీ ఇచ్చిందని.. తొలి మంత్రివర్గంలో మెగా డీఎస్సీ ప్రకటన ఉంటుందని చెప్పారని..  మొదటి క్యాబినెట్‌లో 6 హామీలకు చట్టపరమైన పవిత్రతను అందిస్తామన్నారని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ హామీలు బూటకమా లేక ఈ పథకాలు వాగ్దానం చేసిన మీ పార్టీ నాయకులు బూటకమా అని ప్రశ్నించారు. అయితే కొత్త ప్రభుత్వంపై అప్పుడే విమర్శలు చేయడం బాగోలేదని.. కాస్త సమయం ఇవ్వాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: