భారతీయత అంటే మనకు గుర్తుకువచ్చే సాoస్కృతిక కళలలో చేనేత ముఖ్యమైనది. కంటికిoపైన రంగురంగుల వస్త్రాలు, చీరలు, వాటిని నేసే నైపుణ్యo మన వారసత్వం, దేశానికి గర్వకారణం. చేనేత నిత్య సుందరం. నిత్య నూతనం. సంప్రదాయమే కాక, మారుతున్న అభిరుచులకి, జాతీయ అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకి అనుగుణంగా తమ కళను, నైపుణ్యాన్ని మార్చుకుంటూ వస్తున్నారు చేనేత కళాకారులు.కేంద్రంలో ప్రధాని మోదీ ప్రభుత్వం వచ్చాక చేనేత పరిశ్రమకి ప్రభుత్వ చేయూతనందిస్తూ 7 ఆగస్ట్ 2015 తేదిని `జాతీయ చేనేత దినోత్సవం’ గా ప్రకటించింది. అప్పటినుంచి ప్రతి సంవత్సరం దీనిని మనం జరుపుకుంటున్నాము. 7 ఆగస్ట్ చారిత్రాత్మకమైన రోజు, 1905లో ఆ రోజు కలకత్తాలో స్వదేశీ ఉద్యమo ప్రారంభమైంది, విదేశీ వస్తు బహిష్కరణ చేస్తూ, చేనేత మొదలైన దేశీయ ఉత్పత్తులను తిరిగి పునరుద్ధరించి, ప్రజలు భారతీయ జాతీయతను పెంపొందించుకోవాలని స్వదేశీ ఉద్యమ ముఖ్య ఉద్దేశం. అప్పటి జాతీయ నాయకులు లోకమాన్య శ్రీ బాలగంగాధర్ తిలక్, శ్రీ లాలా లాజపత్ రాయ్, శ్రీ అరవిందో ఘోష్ ( తర్వాతిక కాలంలో మహర్షి అరవిoదులవారు), శ్రీ బిపిన్చంద్ర పాల్ స్వదేశి ఉద్యమసారధులు. ఈ చారిత్రక నేపధ్యాన్ని గుర్తు చేసుకుని అదే సంకల్పంతో చేనేత దినోత్సవాన్ని ప్రజలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం అంతర్జాతీయంగా `ఇండియా హ్యాండ్లూమ్’ చేనేత బ్రాండ్ ఆవిష్కరించడమేకాక, `సంత్ కబీర్’ పేరుమీద చేనేత కళాకారులకి అవార్డులు ప్రదా నం చేస్తున్నది.ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక విజ్ఞప్తి చేశారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా వారంలో ఒక్కరోజైననా ప్రజలు చేనేత వస్త్రాలు ధరించాలని కోరారు. దేశంలో అతిపెద్ద అసంఘటిత ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే రంగాల్లో చేనేత ఒకటిని పవన్ కళ్యాణ్ అన్నారు.

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులందరికీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. వారంలో ఒక్కరోజైన చేనేత వస్త్రాలు ధరించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.మన రాష్ట్రంలో ఉప్పాడ, మంగళగిరి, చీరాల, పెడన, పొందూరు, ఎమ్మిగనూరు, వెంకటగిరి… చేనేత వస్త్రాలకు ప్రతీకలుగా ఉన్నాయి. నేడు చేనేత దినోత్సవం సందర్భంగా ఈ రంగంపై ఆధారపడ్డ ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో చేనేత వస్త్రాలు అనే మాట ప్రజల్లో ఒక భావోద్వేగాన్ని నింపాయి. అలాంటి చేనేత రంగానికి జీవంపోయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.అని ప్రకటనలో పేర్కొన్నారు.ఇదిలావుండగా జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడలోని మేరీస్ స్టెల్లా కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి తమ ఉత్పత్తులతో నేతన్నలు స్టాల్ ఏర్పాటు చేశారు. స్టాళ్లలో ఉత్పత్తులు పరిశీలించి, చేనేత కార్మికులతో మాట్లాడిన చంద్రబాబు, సతీమణి భువనేశ్వరి కోసం వెంకటగిరి చీర, ఉప్పాడ జాందాని చీరలు కొనుగోలు చేశారు.ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. చేనేతకారులకు ఇచ్చే అన్ని రుణాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం రద్దు చేసిందని మండిపడ్డారు. చేనేత కార్మికుల ఆదాయం పెరిగేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నాలుగోసారి సీఎం అయ్యాక మొదట కలిసింది చేనేత కార్మికులనేనన్న చంద్రబాబు సహకార సంఘాల నేతలు సమర్థవంతమైన వ్యవస్థకు శ్రీకారం చుట్టాలని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: