ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త ప్రకటించింది. రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీనికి సంబంధించి మార్గదర్శకాలను జారీ చేసింది. ఎక్సైజ్ శాఖలో బదిలీలకు సెప్టెంబర్ 5 తేదీ నుంచి 15 వరకూ అనుమతి ఇస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.పరిపాలనా అంశాల్లో కూటమి సర్కార్‌ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రధానంగా.. అన్ని ప్రభుత్వ శాఖలను ప్రక్షాళన చేసేందుకు సిద్ధమైంది. దానిలో భాగంగా.. ఉద్యోగుల బదిలీలకు ఏపీ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మొత్తం 15శాఖల్లో బదిలీలకు
అనుమతిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల బదిలీల్లో అనుసరించాల్సి మార్గదర్శకాలను వెల్లడించింది. ఈ నెల 19 నుంచి 31వరకు ఉద్యోగుల బదిలీల ప్రక్రియ చేపట్టాలని తెలిపింది.రెవెన్యూ, పంచాయితీ రాజ్, పురపాలక, గ్రామ వార్డు సచివాలయలు, గనులు, పౌర సరఫరాలు, అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఇంజినీరింగ్ ఉద్యోగులుకు బదిలీలకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దేవాదాయ, అటవీ, రవాణా, పరిశ్రమలు, విద్యుత్, వాణిజ్య పన్నులు, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ల్లో బదిలీలకు ఆమోదం తెలిపింది. టీచర్లు, వైద్యారోగ్య సిబ్బంది బదిలీలకు దూరంగా ఉన్నారు.


ప్రజా సంబంధిత సేవల్లో ఉండే శాఖల్లో మాత్రమే బదిలీలకు ప్రభుత్వం అనుమతించింది. ఈ నెలాఖరులోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.ఈ నెలాఖారులోగా ఉద్యోగుల ట్రాన్స్‌ఫర్స్‌ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇక.. ఉద్యోగుల బదిలీలు ఉమ్మడి 13 జిల్లాల ప్రాతిపదికన జరగనున్నట్లు తెలిపింది. గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లు పనిచేసిన ఉద్యోగులు, ఉద్యోగి కానీ.. వారి కుటుంబ సభ్యులకు కానీ ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే బదిలీలకు దరఖాస్తు చేసుకోవచ్చని మార్గదర్శకాలు జారీ చేసింది. అలాగే.. భార్యభర్తలు ఉద్యోగులైతే.. ఒకే ఊరు లేదా సమీప ప్రాంతాల్లో బదిలీలకు అవకాశం ఇచ్చింది. అంధులైన ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చింది. ఉద్యోగ సంఘాల ఆఫీష్‌ బేరర్లకు తొమ్మిదేళ్ల బదిలీ నుంచి మినహాయింపు ఇచ్చింది. అయితే.. ఆయా లేఖలను పరిశీలించిన తర్వాత పరిపాలనపరంగా అవసరమైతే తొమ్మిదేళ్లకు ముందే ఆఫీస్‌ బేరర్లను బదిలీలు చేయొచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: