భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌ ఇటీవల ప్రయాణించిన బోయింగ్‌ స్టార్‌లైనర్‌ వ్యోమనౌకకు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ఆమెతోపాటు మరో నాసా వ్యోమగామి బుచ్‌ విల్‌మోర్‌ కూడా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎ్‌సఎ్‌స)లోనే చిక్కుకుపోయారు. వారిద్దరూ స్టార్‌లైనర్‌లో జూన్ 5న ఐఎ్‌సఎ్‌సకు చేరుకున్న సంగతి తెలిసిందే. అక్కడ ఈ వ్యోమనౌకలో హీలియం లీకేజీ సమస్య తలెత్తడంతో.. నాసా ఇంజనీర్లు దాన్ని సరిదిద్దే పనిలో నిమగ్నమయ్యారు. జూన్ 26న వారు భూమిపైకి తిరిగొస్తారని నాసా నాలుగు రోజుల క్రితం ప్రకటించినప్పటికీ.. ఈ ప్రక్రియ మరోసారి వాయిదాపడింది. వాస్తవానికి పది రోజుల మిషన్‌ను ముగించుకుని వారు జూన్ 14న భూమిపైకి తిరిగి రావాల్సి ఉంది. విమానయాన రంగంలో ఘనమైన చరిత్ర ఉన్న దిగ్గజ సంస్థగా పేరొందిన బోయింగ్‌.. వరుస ప్రమాదాలతో ఇటీవలికాలంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. 2018, 2019 సంవత్సరాల్లో బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాలు ఘోర ప్రమాదానికి గురి కావడంతో పలు దేశాలకు చెందిన విమానయాన కంపెనీలు ఆ విమానాల వినియోగాన్ని నిషేధించాయి. దాంట్లో లోపాలను సరిచేయడంతో 20 నెలల తర్వాత ఆ నిషేధాన్ని ఎత్తివేశాయి. కానీ, ఆ తర్వాత బోయింగ్‌ కంపెనీకి చెందిన ఇతర మోడల్‌ విమానాలు కూడా తరచుగా ఏదో ఒక ప్రమాదానికి గురై వార్తల్లోకెక్కడంతో ఆ సంస్థ పేరెత్తితేనే ప్రయాణికులు భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు.. రోదసిలో సైతం బోయింగ్‌ వ్యోమనౌక రకరకాల లోపాలతో ఇబ్బందిపెట్టడం గమనార్హం.ఈ నేపథ్యంలోనే అంతరిక్షంలో చిక్కుకుపోయిన ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని తెలుస్తోంది. వీరు మంటల్లో కాలిపోయే ప్రమాదం ఉందని యూఎస్ మిలటరీ స్పేస్ సిస్టమ్ మాజీ కమాండర్ రుడీ రిడాల్ఫ్ చెబుతున్నారు.

బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ సురక్షితంగా భూమి మీదకు రావాలంటే..సర్వీస్ మాడ్యూల్ సరిగ్గా అతుక్కోవాలని…క్యాప్సూల్‌ను సరైన కోణంలో అంటిపెట్టుకుంటేనే వారు సేఫ్‌గా భూమికి పైకి తిరిగి రాగలుగుతారని చెబుతున్నారు. మాడ్యూల్ కోణం ఏ మాత్రం సరిగ్గా లేకపోయినా రాపిడి జరిగి మంటలు పుడతాయని రుడీ చెప్పారు. దీనివలన ఆస్ట్రోనాట్స్ మాడి మసవుతారని అంటున్నారు. దీంతో సునీతా విలియమ్స్, బచ్ ల సురక్షితత మీద మరిన్ని అనుమానాలు చెలరేగుతున్నాయి. ఇప్పటికే వారు తిరిగి రావడానికి చాలా టైమ్ పడుతుందని చెబుతున్నారు. దానికి తోడు ఇప్పుడు మరొక భయం ప్రవేశించింది.భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, వెటరన్ వ్యోమగామి బుచ్ విల్మోర్ జూన్ 5న ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి విజయవంతంగా బయలుదేరి జూన్ 22న షెడ్యూల్ ప్రకారం జూన్ 6న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. అయితే వారు ఇప్పటికే భూమికి తిరిగి వచ్చి ఉండాలి. కానీ కొన్ని సాంకేతిక కారణాల లోపంతో ల్యాండింగ్ ఆలస్యమైంది.ఈ సందర్భంలో, సునీత విలియమ్స్ ఎక్కువ రోజులు అంతరిక్షంలో ఉండటం వల్ల బరువు తగ్గడం, కండరాలు ఎముకల సాంద్రత తగ్గడం వంటి సమస్యలను ఎదుర్కోవచ్చు.అంతరిక్షంలో గురుత్వాకర్షణ సున్నాగా ఉంటుంది. దీంతో కండరాలకు ఎముకలకు బరువులు ఎత్తే పని ఉండదు. కాలక్రమేణా, కండరాల ఫైబర్స్ బలహీనపడతాయి. ఎముక కూడా బలహీనపడి విరిగిపోయే అవకాశం ఉంది. రోజంతా అంతరిక్షంలో ఉండడం వల్ల కళ్లపై ఒత్తిడి పెరిగి చూపు మసకబారుతుందని, డబుల్ విజన్ కనిపిస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: