తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది మెగా డీఎస్సీని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వ‌హించింది. ఉపాధ్యాయ నియామకాలపై వేగంగా అడుగులేస్తున్న తెలంగాణ ప్రభుత్వం రీసెంట్ గానే మెగా డిఎస్సీ నిర్వహించిన సంగతి తెలిసిందే.సాధ్యమైనంత త్వరగా కొత్త టీచర్లను నియమించాలనే ఉద్దేశంతో ఉన్న సర్కార్.. అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరణ చేపట్టి ఫైనల్ కీ రెడీ చేసిందట. ఇందులో భాగంగా ఈ పరీక్షకు సంబంధించి ప్రిలిమినరీ 'కీ' ని ఇటీవలే విడుదల చేశారు.అలాగే ఇప్పుడు అధికారులు డీఎస్సీ ఫైనల్  కీ,  ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు దాదాపు ఏర్పాట్ల‌ల‌ను పూర్తి చేశారు. సాధ్యమైనంత త్వరగా కొత్త టీచర్లను నియమించాలనే ఉద్దేశంతో ప్ర‌భుత్వం ఉంది. అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరణ చేపట్టి ఫైనల్ కీ రెడీ చేసింది.ఈ నేపథ్యంలోనే డీఎస్సీ ఆన్లైన్ పరీక్షల ఫైనల్ కీని పాఠశాల విద్యాశాఖ ఇవాళ విడుదల చేసే ఛాన్స్ ఉంది.దీని ప్రకారం అభ్యర్థులు తమకు వచ్చిన మార్కులను ఎవరికి వారు తెలుసుకోవచ్చు. తుది కీ విడుదలైన తర్వాత రెండు, మూడు రోజుల్లో డీఎస్సీ మార్కులకు టెట్ మార్కులు కలిపి జిల్లా వారిగా జనరల్ ర్యాంక్ లిస్టును అధికారులు విడుదల చేస్తారు.సెప్టెంబర్ 5వ తేదీన‌.. టీచర్స్ డే సంద‌ర్భంగా ఈ డీఎస్సీ ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది.రానున్న మూడు నాలుగు రోజుల్లో జిల్లాల వారీగా మెరిట్ జాబితా వెల్లడి చేయనున్నారట. రిజల్ట్స్ వదిలిన తర్వాత ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి ఆ వెంటనే నియామక పత్రాలు ఇవ్వనున్నారు.ఇదిలావుండగా మొత్తం 11,062 టీచర్ల పోస్టుల భర్తీకి స్వీకారం చుట్టింది. ఇందులో 2,629 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉండగా.. 727 భాషా పండితులు.. 182 పీఈటీలు.. 6,508 ఎస్జీటీలు, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ 220 స్కూల్‌ అసిస్టెంట్లు, 796 ఎస్‌జీటీ పోస్టులు ఉన్నాయి. ఈ డీఎస్సీ పరీక్షలకు మొత్తం 2,79,957 దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 87.61 మంది అభ్యర్థులు హాజ‌రైన విష‌యం తెల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: