ఏపీ రాజధాని అమరావతికి మంచి రోజులు వచ్చినట్టే కనిపిస్తున్నాయి. తాజాగా - రాజధాని నిర్మాణానికి  రూ.11 వేల కోట్ల రుణ మంజూరు పత్రాలు సీఆర్డీఏకు హడ్కో అంద జేసింది. సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబుకు హడ్కో అధికారులు రుణ మంజూరు పత్రాలను అందించారు. అమరావతి నిర్మాణానికి రుణం ఇచ్చేందుకు ముంబైలో జరిగిన పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్న హడ్కో.. ఇప్పుడు రుణ మంజూరు పత్రాలు అందించి మాట నిలబెట్టుకుంది.  


నాలుగు మాసాల్లోగా లోన్ అగ్రిమెంట్ వ్యవహారాలను పూర్తి చేసుకోవాలని సీఆర్డీఏ కమిషనర్ ను  హడ్కో అధికారులు కోరినట్టు తెలుస్తోంది. అంటే నాలుగు నెలల్లో ఈ డబ్బంతా అమరావతి కోసం ఖర్చు చేయాలన్న మాట. మరి ఆ రేంజ్ లో పనులు వేగం అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.


అయితే ఈ ఐదేళ్లలో చంద్రబాబు కనీస మాత్రం రాజధానినైనా నిర్మించకపోతే మాత్రం మళ్లీ వైసీపీ వస్తే రాజధాని ఇష్యూ మళ్లీ మొదటికి వచ్చే ప్రమాదం ఉందని.. అందుకే చంద్రబాబు ఇంకా స్పీడ్ గా పని చేయాలని అమరావతి ప్రజలు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: