
రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 200 కోట్ల మేర ప్రభుత్వానికి ఇసుక ఆదాయం తగ్గిందని మన్నె క్రిశాంక్ తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన ఇసుక ఆదాయం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి జేబు లోకి వెళ్తోందని మన్నె క్రిశాంక్ ఆరోపించారు. ఇందిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుక పేరుతో టన్నుల కొద్దీ ఇసుకను తరలించి అమ్ముకుంటున్నారని మన్నె క్రిశాంక్ అన్నారు. మేడిగడ్డ సహా ప్రాజెక్టుల దగ్గర నీరు ఖాళీ చేసి మరీ ఇసుకను తరలిస్తున్నారని క్రిశాంక్ అన్నారు. ఆదాయం తక్కువ చేసి చూపుతున్నారని... ఇసుక అంతా ఎక్కడికి వెళ్తోందని మన్నె క్రిశాంక్ ప్రశ్నించారు.
లారీల అసోసియేషన్ కూడా ఓవర్ లోడింగ్ పై అభ్యంతరాలు వ్యక్తం చేసిందని మన్నె క్రిశాంక్ గుర్తు చేశారు. మూడు షిఫ్టుల్లో ఇసుక మైనింగ్ చేయాలని తాజాగా ఖనిజాభివృద్ధి సంస్థ ఉత్తర్వులు జారీ చేసిందని... అది కేంద్ర ప్రభుత్వ పర్యావరణ నిబంధనలకు విరుద్ధమని మన్నె క్రిశాంక్ పేర్కొన్నారు. మినరల్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ కు ఏడాదిలో ఐదుగురు ఎండీలు మారారని మన్నె క్రిశాంక్ అన్నారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ జరిగిన ఇసుక అమ్మకాలన్నీ బయట పెట్టాలని డిమాండ్ మన్నె క్రిశాంక్ చేశారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఈ అంశాన్ని లేవనెత్తుతుందని... స్పీకర్ సమక్షంలో ఇసుక రికార్డులన్నీ బయట పెట్టాలని మన్నె క్రిశాంక్ అన్నారు.