హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా చేసే గోదావరి డ్రింకింగ్ వాట్ సప్లై ఫేజ్ 1 పనుల కారణంగా 24 గంటలపాటు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని జలమండలి వెల్లడించింది. కొండపాక పంపింగ్ స్టేషన్ వద్ద ఉన్న వాల్వులు అమర్చనున్న కారణంగా ఈ నెల 17న ఉదయం గంటల నుంచి 18న ఉదయం 6 గంటల వరకు నీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని తెలిపింది.


ఈ పనుల వల్ల ఎస్.ఆర్.నగర్, సనత్ నగర్, బోరబండ, ఎస్పీఆర్ హిల్స్, ఎర్రగడ్డ, బంజారాహిల్స్, వెంగళ్ రావు నగర్, ఎల్లారెడ్డిగూడ, సోమాజిగూడ, ఫతేనగర్, కూకట్ పల్లి, భాగ్యనగర్, వివేకానంద నగర్, ఎల్లమ్మబండ, మూసాపేట్, భరత్ నగర్, మోతీ నగర్, గాయత్రినగర్, బాబా నగర్, కేపీహెచ్ బీ, బాలాజీ నగర్, హస్మత్ పేట్ తోపాటు చింతల్, సుచిత్ర, జీడిమెట్ల, షాపూర్ నగర్, గాజుల రామారం, సూరారం, ఆదర్శ్ నగర్, భగత్ సింగ్ నగర్, జగద్గిరిగుట్ట, అల్వాల్, మచ్చబొల్లారం, ఢిపెన్స్ కాలనీ, వాజ్ పేయ్ నగర్, యాప్రాల్, కొండాపూర్, డోయెన్స్, మాదాపూర్ సహా పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని జలమండలి పేర్కొంది. ప్రజలు తాగునీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: