కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు కేటీఆర్ ఘాటుగా బహిరంగ లేఖ రాశారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలన తరువాత కూడా... తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రమేనన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులతో తెలంగాణ ప్రజల దశాబ్దాల కష్టాలు తీర్చామని తెలిపారు.


తెలంగాణ దశ దిశను మార్చి రాష్ట్రానికి తరగని ఆస్తులు సృష్టించామన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. దేశ చరిత్రలోనే అత్యధికంగా అప్పులు చేసిన మీరా మాపై అభాండాలు మోపేదని నిర్మలా సీతారామన్ కు గట్టి కౌంటర్ ఇచ్చిన కేటీఆర్.. కేంద్ర అప్పులన్నీ కార్పొరేట్ శక్తుల లక్షల కోట్ల రుణాల మాఫీ కోసమేనని ఎద్దేవా చేశారు. ప్రతి బడ్జెట్ లో తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్న బీజేపీని ప్రజలు క్షమించరన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పదేళ్లలో  తెచ్చిన 125 లక్షల కోట్ల అప్పుతో ఏం చేశారో చెప్పాలని నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: