అడవి జంతువులు, కోతుల నుంచి పంటల నుంచి రక్షించుకోవడం చాలాసార్లు ఇబ్బందిగా మారుతోంది. దీంతో అడవి జంతువులు, కోతుల నుంచి పంటల నుంచి రక్షణకు సోలార్ పెన్సింగ్ స్కీం ప్రవేశపెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పామాయిల్‌తోపాటు ఇతర పంటలకు బిందు, తుంపర సేద్య పరికరాలు అవసరం మేరకు రైతులకు అందిస్తామని మంత్రి  తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

రాష్ట్ర అవసరాలు తీర్చే విధంగా కూరగాయల సాగు పెంపునకు సెమీ అర్బన్ క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని.. జూన్ మొదటి వారంలోపు రాష్ట్రంలో మరో ఆయిల్‌పాం కర్మాగారం అందుబాటులోకి వస్తుందని మంత్రి  తుమ్మల నాగేశ్వరరావు వివరించారు. మరో రెండు ఫ్యాక్టరీల నిర్మాణ పనులు ఆరంభించేలా చర్యలు తీసుకుంటామన్న మంత్రి  తుమ్మల నాగేశ్వరరావు.. మెకడమియా పంట సాగుకు అవసరమైన పరిస్థితులను, అనువైన ప్రాంతాల అధ్యయనం  చేయాలన్నారు.

అలాగే ప్రగతి చూపని ఆయిల్‌పాం కంపెనీలపై చర్యలు తీసుకుంటామని.. ఇప్పటికే విశ్వతేజ ఆయిల్‌పాం కంపెనీకి ఇచ్చిన అనుమతులు రద్దు  చేశామని మంత్రి  తుమ్మల నాగేశ్వరరావు వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: