వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై మరో కేసు నమోదైంది. అయితే ఇది పాత కేసుల్లా ఆస్తుల కేసు కాదు.. ఇది నిన్నటి మిర్చి యార్డు పర్యటనకు సంబంధించిన కేసు. వైఎస్ జగన్ సహా  మరో 8 మంది వైకాపా నేతల మీద నల్లపాడు స్టేషన్ లో కేసు నమోదు చేశారు.


నిబంధనలకు విరుద్ధంగా నిన్న గుంటూరు మిర్చి యార్డ్ లో కార్యక్రమం నిర్వహించినందుకు జగన్ పై కేసు నమోదు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉందని అధికారులు హెచ్చరించినా పట్టించుకోలేదనందుకు ఈ కేసు పెట్టినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. జగన్ తో పాటు  కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి పై కేసు పెట్టారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న తలశిల రఘురాం, కావటి మనోహర్ నాయుడు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద కూడా కేసు పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: