కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గ్రాఫ్ పడిపోయందని.. ఇక అది పైకి లేచేది లేదని నిన్న కేసీఆర్ బీఆర్ఎస్ నేతల సమావేశంలో అన్నారు. దీనిపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి జూపల్లి కృష్ణారావు.. ఎవరీ గ్రాఫ్ పడిపోయిందో ప్రజలకు తెలుసన్నారు.

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు మీకు కర్రు కాల్చి వాత పెట్టారన్న మంత్రి జూపల్లి కృష్ణారావు.. అందుకే ఇన్నాళ్లు మొహం చాటేశావ్ .. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి అవమానం తట్టుకోలేకే ఫాం హౌస్ కు పరిమితమయ్యావు అని విమర్శించారు.


ఇన్ని నెలలు తెలంగాణ ప్రజలు నీకు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించిన మంత్రి జూపల్లి కృష్ణారావు.. పార్టీ సంస్థాగత నిర్మాణం,  సిల్వర్ జూబ్లీమీద ఉన్న ప్రేమ  రాష్ట్ర ప్రజలపై లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో  బీఆర్ఎస్  ఒక్క సీటు కూడా గెలవలేదన్న మంత్రి జూపల్లి కృష్ణారావు.. ఓటమి భయంతోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీ ఆర్ఎస్ పోటీ చేయలేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీఆర్ ఎస్ కు ఓటమి తప్పదని మంత్రి జూపల్లి కృష్ణారావు జోస్యం చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: