టీడీపీలో ఫైబర్ నెట్ గొడవ నడుస్తోంది. తాను ఉద్యోగులను తొలగించినా ప్రభుత్వం వాళ్లను తొలగించలేదని ఛైర్మన్ జీవీ రెడ్డి ఇటీవల ప్రెస్ మీట్ పెట్టిన సంగతి తెలిసిందే. ఛైర్మన్ ప్రెస్ మీట్ పెట్టి రచ్చ చేయడంతో మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఈ అంశంపై దృష్టి సారించారు. సచివాలయంలో మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డితో ఏపీ ఫైబర్ నెట్ అధికారులు సమావేశం నిర్వహించారు.

ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి చేసిన ఆరోపణలపై ఏపీఎఫ్ఎస్ఎల్ ఎండీ దినేష్ కుమార్ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి జీవీ రెడ్డి.. శనివారం సాయంత్రంలోగా ఈ వ్యవహారంలో రాతపూర్వక వివరణ ఇవ్వాలని దినేష్ కుమార్ ను ఆదేశించారు. మీడియా సమావేశంలో చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు ఇవ్వాలని జీవీరెడ్డికి  మంత్రి కార్యాలయం లేఖ రాసింది. రెండు రోజుల్లోగా దీనిపై ఆధారాలు సమర్పిస్తామని ఏపీఎఫ్ఎస్ఎల్ చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. ఈ వివరణలు వచ్చాక ఈ వ్యవహారంలో ముందుకు వెళ్లాలని మంత్రి జనార్ధన్ రెడ్డి నిర్ణయించినట్టు తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: