తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి మంచి మనసు నిరూపించుకున్నారు. కాలిన గాయాలతో లేవలేని స్థితిలో మంచానికే పరిమితమైన సలీమాను ఆదుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తక్షణమే ఆమెకు తగిన వైద్య సహాయం అందించడంతో పాటు దివ్యాంగుల పింఛను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లు  కూడా మంజూరు చేయాలని అధికారులకు సూచించారు.


వంట చేసుకుని తినే పరిస్థితి లేకపోవడంతో ఆమెకు భోజనం సదుపాయం  కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం గుండ్లసింగారం గ్రామానికి చెందిన  సలీమా దీన స్థితిపైన పత్రికలో వచ్చిన కథనంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు. కాలిన గాయాల కారణంగా సలీమా నరాలు దెబ్బతినడంతో ఆమె మంచానికే పరిమితమయ్యారు. దీంతో సలీమా పదేళ్ల కుమార్తె రిజ్వాన నిత్యం తల్లికి సపర్యలు చేస్తోంది. ఒక వైపు తల్లి బాధ్యతలు చూసుకుంటూనే బడికి వెళ్లి చదువుకోవడం విశేషం

మరింత సమాచారం తెలుసుకోండి: