
నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలోని ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి ఆరా తీశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రధానమంత్రి మోదీకి తెలియజేశారు.
సొరంగంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకున్నారని రేవంత్ రెడ్డి మోదికి తెలిపారు. వారిని కాపాడేందుకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టామని ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి వివరించారు. మంత్రులు reddy NALAMADA' target='_blank' title='ఉత్తమ్ కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఉత్తమ్ కుమార్ రెడ్డి , జూపల్లి కృష్ణారావు దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని ప్రధానమంత్రి మోదికి రేవంత్ రెడ్డి చెప్పారు.
సహాయక చర్యల కోసం వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పంపిస్తామని ప్రధాని మోదీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి తెలిపారు. పూర్తిస్థాయి సహకారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి మోదీ రేవంత్ రెడ్డికి హామీ ఇచ్చారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే మంత్రులను, అధికారులను అప్రమత్తం చేశారు. నిన్న ఉదయం నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. మంత్రులు reddy NALAMADA' target='_blank' title='ఉత్తమ్ కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఉత్తమ్ కుమార్ రెడ్డి , జూపల్లి కృష్ణారావు తో పాటు డీఐజీ, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులను హుటాహుటిన ప్రమాదస్థలికి పంపించారు. మంత్రి reddy NALAMADA' target='_blank' title='ఉత్తమ్ కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానిక అధికారులు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్ఆర్డీఎఫ్ బృందాలతో పాటు ఇతర సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.