రోజురోజుకు పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్ కు  అనుగుణంగా జాబ్ రిక్రూట్మెంట్ క్యాలెండర్ ను అమలు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు. ప్రజా భవన్ లో తెలంగాణ ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజనీర్స్ అసోసియేషన్ నేతలు డిప్యూటీ సీఎం కలిశారు. ఈ సందర్భంగా వారికి డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు. రామగుండంలో 800 మెగావాట్ల నూతన విద్యుత్ కేంద్రాన్ని 100శాతం జెన్కో ఆధ్వర్యంలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల డిప్యూటీ సీఎంకు  అసిస్టెంట్ ఇంజనీర్లు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు.

జెన్కోలో అక్టోబర్ 2024 లో ఇచ్చిన ఏటీ టూ ఏడీఈ పదోన్నతులకు పోస్టింగ్ ఉత్తరువులు ఇవ్వాలని అన్నారు.  టీజీ ట్రాన్స్కో, డిస్కం కంపెనీలలో నియామకాలు పదోన్నతుల అంశాలను టీఈఏఈ నేతలు డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకువచ్చారు.


అసిస్టెంట్ ఇంజనీర్ల విజ్ఞప్తికి డిప్యూటీ సీఎం స్పందిచడంతో పాటు, ఇటీవల ఇచ్చిన పదోన్నతుల గురించి త్వరలోనే ఉత్తర్వులు వచ్చేలా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. విద్యుత్ ఉద్యోగులందరూ తెలంగాణలో ప్రజలకు ఎటువంటి విద్యుత్ అంతరాయం కలగకుండా తీవ్రంగా శ్రమించాలని, విద్యుత్ సంస్థలో ఉద్యోగం సేవా భావనతో కూడినదని దిశ నిర్దేశం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: