
రెండు జలాశయాల్లో అందుబాటులో ఉన్న నీటిని వినియోగించుకునే విషయమై ఈ సమావేశంలో చర్చించారు. మే నెలాఖరు వరకు తమకు 63 టీఎంసీలు కావాలని తెలంగాణ, 55 టీఎంసీలు కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు మొన్నటి సీఈల సమావేశం తర్వాత వివరాలు సమర్పించాయి. ప్రస్తుతం రెండు జలాశయాల్లో కనీస వినియోగ మట్టానికి ఎగువన 60 టీఎంసీలకు పైగా నీరు ఉంది. ఉన్న కొద్ది పాటి నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని బోర్డు రెండు రాష్ట్రాలకు సూచించింది.
ముందుగా తాగునీటికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. ఆ తర్వాత ఉన్న పంటలను దృష్టిలో పెట్టుకొని మిగిలిన నీటిని ప్రణాళికతో వాడుకోవాలని తెలిపింది. ప్రతి 15 రోజులకు ఒకసారి పరిస్థితులను సమీక్షించుకుంటూ ముందుకెళ్లాలని రెండు రాష్ట్రాలకు సూచించింది.