
గతంలో ఆయన డ్రగ్స్ కేసులో దొరికినట్లు ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. ఆయనతోపాటు ఉన్న వ్యక్తులు ఎవరో తెలియాల్సి ఉందని ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణలో అక్రమంగా సంపాదించిన వేల కోట్లు దుబాయ్ తరలించారని ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు.
గత ప్రభుత్వంలో బినామీలు ఇప్పుడు ఎక్కడికి పోయారో తెలియాల్సి ఉందని ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్ రెడ్డి అభిప్రాయపడ్డారు. వేలకోట్లు విదేశాలకు తరలిపోతుంటే రాష్ట్రంలో విచారణ సంస్థలు ఏం చేస్తున్నాయని ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు.
ప్రభుత్వం ఏర్పడి 14నెలలు అవుతున్నా విచారణ సంస్థలు ఇప్పటి వరకు ఒక్క హవాలా వ్యక్తిని కూడా పట్టుకోలేదని ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైన హవాలా దందాపై చర్యలు తీసుకోకపోతే భవిషత్తులో తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.