కర్ణాటక రాజకీయాల్లో తెలంగాణ కాంట్రాక్టుల కలకలం రేగుతోంది. లోకాయుక్తలో కర్ణాటక ఎమ్మెల్యే మునిరత్నం చేసిన ఫిర్యాదు మేరకు.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో పాటు కర్ణాటక డిప్యూటి సీఎం డీకే శివకుమార్‌పై విచారణ జరిపించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. డీకే శివకుమార్‌ 15 శాతం కమిషన్ తీసుకుంటూ.. బెంగళూరు కాంటాక్టులను తెలంగాణకు చెందిన కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నారని.. కర్ణాటక ఎమ్మెల్యే లోకాయుక్తకు ఫిర్యాదు చేసినట్లు మన్నె క్రిశాంక్‌ తెలిపారు.


ఈ వ్యవహారమంతా రేవంత్‌రెడ్డి కుటుంబసభ్యుల ప్రోద్భలంతోనే జరుగుతుందని మన్నె క్రిశాంక్‌ ఆరోపించారు. తెలంగాణకు చెందిన కేపీసీ కంపెనీకి కర్ణాటకలో 210 కోట్ల రూపాయల కాంట్రాక్ట్‌ కట్టబెట్టారని.... కేపీసీ అనిల్‌ కుమార్‌కి, సీఎం సోదరుడు తిరుపతిరెడ్డికి మధ్య డీల్ ఎంతకు కుదిరిందో చెప్పాలని మన్నె క్రిశాంక్‌ ప్రశ్నించారు. బెదిరించడమే రేవంత్‌రెడ్డి అజెండా అన్న క్రిశాంక్.. ముందు సీఎం బెదిరిస్తే.. తర్వాత ఆయన సోదరుడు సెటిల్ చేస్తారంటూ మన్నె క్రిశాంక్‌ సెటైర్లు వేశారు.


ఎస్ఎల్ బీసీ  వద్దకు బీఆర్ఎస్ నేతలు వెళితే అడ్డుకుని.. బీజేపీ నేతలను మాత్రం దగ్గరుండి సొరంగంలోకి తీసుకెళ్లారని మన్నె క్రిశాంక్‌ విమర్శించారు. వీటన్నిటిపై బీజేపీ ప్రభుత్వం విచారణ చేయించకపోవడంతో.. ఆ రెండు పార్టీలు ఒక్కటేనని స్పష్టమవుతుందని మన్నె క్రిశాంక్‌ అన్నారు. రేవంత్‌ సర్కారుపై బీజేపీ విచారణ చేయించినా, చేయించకపోయినా.. రెండు పార్టీలనూ తమ పార్టీ ప్రశ్నిస్తూ నిజాలను ప్రజల ముందు ఉంచుతుందని మన్నె క్రిశాంక్‌ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: