
బడ్జెట్లో 70 వేల కోట్ల లోటు ఉందని సీఎం గతంలో చెప్పారని, ఇవాళ 95 శాతం బడ్జెట్ నిజం కాబోతోందని అంటున్నారని, ఏది నిజమని హరీశ్ రావు ప్రశ్నించారు.
400 ఎకరాలు అభివృద్ధి అని అందమైన అబద్ధం చెప్పారని, నాడు భూముల అమ్మకాన్ని వ్యతిరేకించి ఇవాళ ఎలా సమర్థించారని హరీశ్ రావు విమర్శించారు. ఐఎంజీ భూముల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హైకోర్టు, సుప్రీంకోర్టులో కొట్లాడిందని, నీటిపారుదల, పౌరసరఫరాల పద్దులపై సభలో మాట్లాడేందుకు బీఆర్ఎస్కు అవకాశం ఇవ్వలేదని హరీశ్ రావు ఆరోపించారు.
మల్లన్నసాగర్ భూసేకరణ అడ్డుకునేందుకు ప్రస్తుత మంత్రి దామోదర రాజనర్సింహ కేసులు వేయించారని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి కేసులు వేయించారని హరీశ్ రావు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో చేరానని కడియం శ్రీహరి బహిరంగంగా చెబుతుంటే, సీఎం మాత్రం చేరలేదని అంటున్నారని హరీశ్ రావు విమర్శించారు